కొరవి వీరభద్రుడు
సంగ్రహ ఆంధ్ర
యొక్క , శాక్తేయుల యొక్క ద్వారమున ప్రచారము నందిన వీరభద్రుడు భయంకరమూర్తిగానే లభ్యుడగు చున్నాడు. అయితే, శివున కగ్ని సంబంధము చెప్పబడి యున్నది. తదంశ సంభూతుడయిన వీరభద్రునికిని అగ్నిసంబంధ ముండును. అతడు రౌద్రుడు కూడాను. అందు కనియే వీ రిద్దరి యునికి వల్లనే ఈ స్థలమునకు అగ్నిరూపమయిన 'కొరవి' యని పేరు వచ్చినట్లు భావింపబడు చున్నది. (ఒకప్పుడు దగ్ధమయినది కూడ. ప్రస్తుత మీ గ్రామము ప్రభుత్వ వ్యవహారములలోను మరికొన్ని వ్యవహారములలోను 'కురవి" యని యున్నను, శాసనములందు మాతము 'కొరవి' యనియే పేర్కొనబడినది.)
వీరభద్రు డసలు బ్రహ్మచారి. అతనికి 'దేవి' లేదు. మొదట ఇక్కడి పూజారులు బ్రహ్మచారులై యుండిరి. కాని మధ్యకాలమున ఎక్కడినుండియో ఒక భద్రకాళి యొక్క. విగ్రహ మెవరిచేతనో కొనిరాబడి ఇక్కడ ప్రతిష్ఠితమయినది. (విగ్రహమునందు ప్రాచీనత్వము కానరాదు.) నిజమునకు భద్రకాళి శక్తి కాదు. శక్తియొక్క యంశము మాత్రమే. అయితే వీరభద్రుడు, భద్రకాళి అను పదములయందు 'భద్ర' పద సామ్యమునుబట్టి వీరిద్దరికి భార్యాభర్తృత్వ సంబంధము కల్పింపబడి యుండును. (ఇద్దరును అంశమాత్రులేగదా) ఈ భార్యా భర్తృత్వ సంబంధ మేర్పడినప్పటినుండి బ్రహ్మచారులు తప్పుకొనగా, గృహస్థులే పూజారులయినారు.
మొదట ఈ యాలయముయొక్క సింహద్వారము పశ్చిమ ముఖముగా నుండెనట. కాని ఆలయద్వారము గ్రామమున కెదురుగా (ప్రన్తుత గ్రామము కాదు, పూర్వము దగ్ధమైన గ్రామము) నుండుట మంచిదికాదను కొందరి ఆలోచన చొప్పున మహబూబాబాదు నివాసి యగు శ్రీ ఆళ్లపాటి ముత్తయ్యగారు పూర్వపుదానిని మార్చి ఉత్తర ముఖముగా సింహద్వారమును (నృసింహాలయ సింహద్వారమున కెదురుగా) నిర్మించినారట. ఈ ద్వారముపై గోపుర మాంధ్రప్రాంతమందువలె త్రికల శకమే గాని, తెలంగాణమందలి గోపురముల మాదిరిగా ఏక కలశ పరిశోభితము కాదు. దాదాపు తెలంగాణ మందంతటను ఏక కలశక గోపురములే కనబడుచున్నవి. ఈ సింహద్వారము దాదాపు శతాబ్ది పూర్వకాలికమై యున్నట్లు చెప్పుదురు. ఆలయములోని కళ్యాణమండపముగూడ ఆకాలమునకు ఛెందినదిగానే కనబడును. ఆ మండపమున కెదురుగ దాదాపు పదునాలుగు అడుగుల ఎత్తయిన యెఱ్ఱరాతి దీపస్తంభ మొకటి యున్నది. దీని నిర్మాణమందు ప్రాచీనత్వమున్నది. ఆలయములో వీరభద్రుని కెదురుగా మూడు నందులున్నవి. కాని వాటి నిర్మాణ శిల్పమందు ప్రాచీనత్వము కనరాదు. గర్భాలయము నంటుకొనియున్న మండపము నందును అంతే.
ఈ యాలయములోని యంత్రము అత్యంత శక్తిమంత మయినదట. అందుచేత అక్కడికి వచ్చిన భక్తు లావేశితులయి, తమ యొక్కయు, ఇతరుల యొక్కయు దోషములను వెలిగ్రక్కెడివారట. దానివలన అనేకములయిన సాంసారిక, సాంఘిక ప్రమాదము లేర్పడెడివట. అందుకని ఈ ప్రాంతీయుల యభ్యర్థనపై ఆంధ్ర ప్రాంతీయులును, తాంత్రికులు నయిన శ్రీ ముదిగొండ కోటయ్య అను మహానీయులు వచ్చి, ఆ యంత్రముయొక్క తీవ్రతను తగ్గించి, దానిని సాధువుగా నొనరించినారట. అప్పటి నుండి పూర్వపు ప్రమాదములన్నియు వారింపబడి భక్తుల కోరికలు నెరవేరుటమాత్రమే జరుగుచున్నదట.
ఈ దేవాలయమునకు ధర్మకర్త లనువారు ఎవ్వరును లేరు. ఈ ప్రాంతపు దేశముఖులుగూడ దీని విషయమున ప్రత్యేకశ్రద్ధ వహించినట్లు కనిపించదు. ఈ ఆలయమునకు ఈనాముగా దాదాపు మూడెకరముల పరిమితిగల 'తరి' భూమియు, మెట్టపొలమును ఉన్నట్లు తెలియుచున్నది. భూమికి సంబంధించిన కొన్ని పూజారుల తగాదాలవల్ల చాలకాలముక్రితమే ఆ భూమి వీరభద్రుని పేరనే పట్టా అయిపోయినది. దానిమీది ఆదాయమును, దేవాలయము నందు వచ్చు నాదాయమును, పూజారులు తమ నిమిత్తము, ఆలయము నిమిత్తము వ్యయ మొనరించుచుండిరి. 1950 వ సంవత్సరము వరకును ఇట్టి పద్దతియే అమలులో నుండెను.
1951 వ సంవత్సరమున ప్రభుత్వానుమతితో దేవాలయ నిర్వహణము కొరకు 'కమిటీ' యొకటి ఏర్పాటు చేయబడినది. దానికి అధ్యక్షులుగా స్టానికు లయిన తహసీలుదారుగా రుండునట్లును, ప్రజల పక్షమున ఐదుగురు సభ్యు లుండునట్లును నిర్ణయమయినది. ఆ ఐదు
74