పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు


రామాయణము నందలి పర్ణశాల యనునది ఎచ్చట నున్నది? అను విషయములో మహారాష్ట్ర పత్రికలలో వాదోపవాదములు చెలరేగెను. మహారాష్ట్రములోని నాసి కాత్ర్యంబక మే పర్ణ శాలయని మహారాష్ట్రుల వాదము. ఈ వాదమునందు బాలగంగాధర తిలకు మొదలగు పండిత ప్రకాండులను ఢీకొన్న సాహసికుడు లక్ష్మణరాయడు. భద్రాచలమునొద్ద నున్న పర్ణశాలయే రామాయణము నందు వర్ణితమైన పర్ణశాల యని తర్కబద్ధముగ, సోదా హరణముగ నిరూపించి మహా రాష్ట్ర విద్వాంసులను దిగ్భ్రామ గొల్పిన ప్రతిభాశాలి లక్ష్మణ రాయడు. మహారాష్ట్ర భాష ద ఈ య సాహిత్య వ్యవసాయము అపారమని తెలియుచున్నది. ఇప్పటికిని లక్ష్మణ రాయని ప్రేమ గౌరవములతో మహా రాష్ట్ర విద్వాంసులు స్మరించు చుందురు. ఈనాటికి కూడ

చుండువారు. శ్రీ రాయసం వేంకటశివుడుగారు ప్రచు రించుచుండిన “జనానా పత్రిక"కు "విశ్వముయొక్క విరాట్ స్వరూపము", "విశ్వముయొక్క బాల స్వరూ పము" - ఇత్యాది ఘన విషయములను గూర్చి లక్ష్మణ రావుగారు వ్యాసములు వ్రాసి యున్నారు. అంతియేగాదు. లక్ష్మణరావుగారును, అచ్చమాంబయు ఆంధ్రభాషలో ప్రప్రథమమున గ్రంథ రచనకు కూడ కడగిరి. అచ్చమాంబగారు “అబలా సచ్చరిత్రమాల" అను ఉద్గ్రంథమును లక్ష్మణరావుగారు “శివాజీ చరిత్ర" మను గ్రంథ రాజ రచించిరి. మును రచించిరి. చిత్రము - 16

మహారాష్ట్ర వాఙ్మయ సం స్కృ తిలో లక్ష్మణ రావుగారికి అత్యున్నతస్థాన మున్నది. లక్ష్మణరాయడు మహా రాష్ట్రమం దున్నంత కాలము మాతృభాష యగు ఆంధ్ర భాషను విస్మరించెనని తలచ కూడదు. వీరును, వీరి అక్కగారగు భండారు అచ్చ మాంబగారును ఆంధ్రభారతిని తమ ఇంట నెలకొల్పి ఆరాధించుచునే యుండిరి. వీరిద్దరకు గల ఆంధ్ర భాషా భిమానము ఆ కాలములో పెక్కుమందికి మృగ్యమై యుండెను. పరభాషా ప్రాంతములలో నుండిన నేమి? మాతృభాష యెడ ఎట్టి అపచారమును లక్ష్మణరావు గారును, అచ్చమాంబయు సహించెడివారు కారు. కావున రిద్దరును ఆంధ్ర భాషలో విశేష విజ్ఞానమును గడింప సాగిరి. ఆంధ్ర దేశములోని ఆంధ్ర పత్రికలకు లక్ష్మణరావు గారును, అచ్చమాంబగారును వ్యాసములు వ్రాయు

చరిత్రగ్రంథ పీఠిక లో మొదటి నాలుగు పంక్తులలో పంతులుగారు తమ అభీష్ట మును ఇట్లు సూచించి యున్నారు: ఆంధ్ర భాషయందు చరిత్ర గ్రంథంబు లత్యల్ప ముగా నున్నవి. కాన చేత నైనంతవరకు మాతృభాషా సేవ చేయ వలయు నని యిచ్ఛ గలవాడను" అని మున “ఇట్లు ఆంధ్ర భాషా యిచ్ఛతో నీ చరిత్రగ్రంథంబు వ్రాసినాడ. శక్తివంచన లేక యిక ముందును ని భాషా సేవ చేయవలయునని వ్రాయుటయేగాక పీఠికాంత సేవకుడు, గ్రంథకర్త" అని సంతకము చేసి యున్నారు. ఈ ఆదర్శమును అక్షరాలా క్రియాపూర్వకముగ నెర వేర్చి జీవితపు తుది నిమిషము వరకును ఆచరణములో పెట్టిన ధన్యజీవి లక్ష్మణరావు గారు. అయితే ఈ సత్సంకల్పము లక్ష్మణరావుగారికి నాగపూరులో విద్యార్థిగా బి. ఏ. పరీక్షకో, ఎం. ఏ. పరీక్షకో చదువుకొనుచున్న రోజులలోనే ఏర్పడినది. అప్పటికే అధికారవాంఛ, ఐహిక భోగములు ఆదర్శ ములుగా పెట్టుకొని ఆకాశ హర్మ్యములను మానస 67