పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండాపురము సంగ్రహ ఆంధ్ర


ఇటిక 22 అంగుళముల పొడవు, 12 అంగుళముల వెడల్పు రెండున్నర అంగుళముల మందము కలదిగా నుండెను. గోడల మూలలందు 20 అంగుళముల చదరపు ఇటిక లను వాడిరి. గుండ్రని కట్టడములకు—స్తూపములు, గోపుర ములు మున్నగు వాటికి-వంపు మూలలు గల ఇటికలను వాడుచుండిరి. ఈ యిటికలు 2000 సంవత్సరములు గతించి నప్పటికిని ఇంకను చెక్కు చెదరక అందముగా నున్నవి. ఇండ్లపై పెంకులు కప్పుచుండిరి. నేలగచ్చు చేయుచుండిరి.

ఇచ్చట మూడు విహారములు, రెండు చైత్యములు, 3 స్తూపములు కనబడినవి. ఒక విహారములో 7 గదులు కలవు. 4-5 గదుల మధ్య 5 అడుగుల 2 అంగుళముల వెడల్పు గల నడవ కలదు. ప్రతి గదియు 10 చదరపు టడుగుల విస్తీర్ణము కలదిగా నున్నది. బౌద్ధభిక్షువుల నివాసము కొరకు మూలలయందు కట్టబడిన కొట్టిడీలు కలవు. ఒక చై త్యముయొక్క లోపలి భాగము 25 అడు గుల 4 అంగుళముల పొడవు, 10 అడుగుల 4 అంగుళ ముల వెడల్పు కలిగి యున్నది. ఒక స్తూపముయొక్క ఆవర్తపు అడ్డు కొలత 19 అడుగు లున్నది. ఇచ్చట బుద్ధదేవుని ప్రతిమ దొరకలేదు. కావున ఇచటి జనులు హీనయాన శాఖకు చెందిన బౌద్ధు లయి యుందురని తేలుచున్నది. ప్రతి గృహమునందును ఒకటి, రెండు నేలమాళిగలు కనబడినవి. ఈ నేలమాళిగలలోనే వివిధ నాణెములు, అచ్చు దిమ్మెలు, విగ్రహములు, అమూల్యాభరణములు, పూసల పేర్లు మొదలగునవి దొరకినవి. వాటిని అమూ ల్యములుగా భావించి నేలమాళిగలలో భద్ర ప ర చి యుందురు. అసేతు హిమాచల పర్యంతము గల చరిత్ర పరిశోధకులను ఆశ్చర్యచకితులను గావించినది ఇచ్చట గనబడిన కుంభ కార విద్యాప్రావీణ్యము. ఇచ్చటి కుమ్మరి చిత్రకళను, శిల్పకళను మేళవించిన ప్రతిభాశాలి. ఈతడు మట్టితో కుండలనే గాక గాజులను, సొమ్ములను కూడ చేయుచుండెడివాడు. ఎఱ్ఱమట్టినే వాడుచుండెను. ఒక జాడి అసాధారణమగు పనితనము గలిగి ఎత్తుగా నున్నది. ఒక భాండము తొమ్మి దడుగుల వలయము, మూడడు గుల లోతు కలిగి, వన్నెచిన్నెలతో నిగనిగలాడుచున్నది.

మృణ్మయ పాత్రములు వివిధ వర్ణములతో చిత్రాలంకార భూషితము లయి నాజూకుగా నున్నవి. పూజకు ఉపయో గించు థాండములపై సాంకేతిక చిహ్నములు కలవు. ఒక దానిమీద "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి" అను త్రిరత్నములు చిత్రింపబడినవి. ఈ కుమ్మర వాడు బోలు విగ్రహములను తెల్లని, మెత్తని మట్టితో చేసి త్రివర్ణములతో చిత్రించినాడు. ఆ విగ్రహ ముల తలలపై శిరో వేష్టనములు గలవు. ఆ విగ్రహముల పాగాలు, వాటి మెడలోని హారములు, వాటి చెవులకు గల పోగులు, ఆక రకములుగా నున్నవి. కొన్ని నవ్వు పుట్టించు విగ్రహములు కలవు. ఈ కుమ్మరి హాస్యప్రియు డుగా కనబడుచున్నాడు.


ఇచ్చటి కమ్మరీడును గట్టివాడే. కొడవళ్ళు, గొడ్డళ్ళు, పటకాలు, బాకులు, ఉలులు, మేకులు, నాగళ్ళు మొద లగునవి దొరికినవి. బల్లెముల అగ్రములు దొరకుట చే ఇచ్చట సై న్య ముండెనని తోచుచున్నది. కొలుములు, తిత్తులు, కాల్చిన పనిముట్లను చల్లార్చుటకు పెద్ద పెద్ద నీటి బానలు, కమ్మరి అంగళ్ళు ఎక్కువ సంఖ్యలో కనబడి నందున కమ్మరి పని ఇచ్చట భారీయెత్తున సాగుచుఁ డెనని మనము గ్రహింప వచ్చును. ఇచ్చట రత్నాల సొమ్ములు, బంగారు సొమ్ములు దొరకినవి. వాటిని భాగ్యవంతులు పెట్టుకొనుచుండి రన వచ్చును. వెండి, రాగి, దంతపు సొమ్ములు, ఆల్చిప్ప సొమ్ములు కూడ దొరకినవి. వీటిని బీదవారు ధరించు చుండి రనవచ్చును. రత్నాభరణములు వివిధాకారము లలో నున్నవి. నిరుపేదల కొరకు కుమ్మరివాడు మట్టి గాజులు, మట్టి హారములు, మట్టి తాయెతులు చేయు చుండెను. భాగ్యవంతులు బంగారు కాసులు దండలు వేసి కొను చుండగా బీద పడుచులు కుమ్మరివాడు సృష్టించిన మట్టికాసుల దండలను వేసికొని కులుకుచుండిరి కాబోలు, ఈ మట్టి కాసులు క్రీస్తుశకములోని రోమక బంగారు నాణెములను అచ్చముగ పోలి యున్నవి. ఇచ్చట సుమారు నాలుగువేల నాణెములు దొరకినవి. ఇందు 10 వెండివి, 100 పంచలోహములవి, 50 రాగివి, మిగత నాణెములు సీసపువి. ప్రతి నాణెమునకు చిల్లి 62