ఈ పుట ఆమోదించబడ్డది
- 170
సంస్కృతన్యాయములు
భిక్షునిమాత్రము త్యజించివైచెను. అట్లు త్యజించివైచుటకు తనయిచ్చయే వానిని పురికొల్పినది. అట్లే---
"ప్రత్యేక పీశవచనాత్వా దుభయో: ప్రామాణ్యే పౌరుషేయత్వా న్మూలక్రమాణసాపేక్షతయా ధర్మాదౌతదభావా దప్రామాణ్యే వా ప్రాప్తే ప్యుక్తనిభాగే తార్కికేచ్చైవ నియామికే త్యర్ధమాహు:"
ప్రకృతాస్తవచనమున ప్రామాణ్యాప్రామాణ్యములు సంభవించినపుడు స్వేచ్చగా తార్కికు లొక పక్షమనలంబింతురు అనికొంద రందురు.
ఏతావతా-- విషమసంఘటనలు రెండు సంఘటించినపుడేదో పక్షమును స్వేచ్చగా నవలంబించుసందర్బమున నీన్యాయము ప్రవర్తించునని రెండవపక్షపు భావము.
సన్యాసియోషాన్యాయమును జూడుము.
సుమసౌరభన్యాయము
పూవు, తావివలె. అవినాభవసంబంధము.
శబ్దము, అర్ధము, ఉఱుము, మెరుపు; వెలుతురు; నీడ; మున్నగునవివలె.
సువర్ణన్యాయము
బంగారమును కఱగినకొలది వన్నెహెచ్చును. శాస్త్రమును తఱచినకొలది మెఱుగు వచ్చును.