పుట:SamardaRamadasu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
10. రాముడు పరమేశ్వరుం డని నమ్ముట.
11. నిగ్రహ రూపములో రాముని జూచుట.

ఈ యంశములే గ్రంథ మందంతట పడుగు పేక వలె నల్లు కొని యున్నవి. భాషా మాధుర్యము, భావగౌరవము, మనోహరశైలియు వానికి వన్నె వెట్టుచున్నవి.

మహారాష్ట్ర దేశమందు బలుతావుల యందు రామదాసుడు నెలకొల్పిన యుత్సవములు మొదలగునవి జనుల సోమరితనమును దవ్వుగ దోలెను. వారు రామదాసుని వలన నుపదేశము బడయుటకై యెంతో యుబలాటపడుచు వచ్చిరి. శివాజీ మహారాజు యొక్క కొలువుకాండ్రు మున్నగు నుద్యోగస్థులు సైతము రామదాసుని శిష్యవర్గములలో జేరిరి. అందుచే శిష్యసంఖ్య మఱింత యెక్కువయ్యెను. ఆత్మలాభమే చూచుకొనుచు దక్కిన వారిగతి చూడక యెవరి కర్మములకు వారిని వదలి వేయునట్టి యీక్రొత్త శిష్యులకొఱకు రామదాసు డంతగా శ్రద్ధ చేయలేదు. అతడు సార్థత్యాగము, మనోనిశ్చలత గల యువకులను జాలమందిని జేరదీసి వారికా బోధలు చేసి, తయారు చేసి, దూరమునందు నెలకొల్పబడిన మఠములలో ధర్మ వ్యాపనము జేయుటకై వారిని నియోగించెను. మొత్తము మీద రామదాసుడు దేశమున నూట యేబది మఠముల స్థాపించెను. వానిమీద డెబ్బది యిద్దరు ముఖ్యశిష్యులు పరామరిక చేసెడు నుపద్రష్టలై యుండిరి. వారి చేతిక్రింద నింక దక్కువ తరగతిలోని యుద్యోగు లనేకులుండిరి.

మహంతులు క్రొత్త మహంతులను నిర్మించి, వారికి దెలివి తేటలు, నైపుణ్యము గలిగించి ప్రతి విషయమున వారి ననుభవ శాలురగ జేసి దేశ మందంతట వారిం బ్రతిష్ఠింప వలయునని యాతని యాజ్ఞ. ఆ సూత్రముల నతని శిష్యులెల్లప్పుడు ననుసరించుచుండిరి.

ప్రతి మఠమునందు మారుతి విగ్రహము స్థాపింపబడెను. మఠాధిపతులు దినమునకును ముమ్మారు సేవలు కైంకర్యములు మొదల