పుట:SaakshiPartIII.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. ప్రకృతిశక్తులు

జంఘాలశాస్త్రికి, పిచ్చివాళ్లని పలకరించి వారిచేత మాట్లాడించడంలో ఆసక్తివుంది కదా! క్రితంసారి విశాఖపట్నం పిచ్చిఆసుపత్రికి వెళ్లి ఒక మనిషిని పలకరించి, అతను సృష్టిలో నీతి, శాసనం లేవనే పద్ధతిలో మాట్లాడగా- ఆ సంగతి మనకు శాస్త్రి చెప్పాడు కదా! ఈసారి కూడా అదే మనిషిని పలకరించగా, ఆయన విజృంభించి ప్రకృతిశక్తుల గురించి మాట్లాడాడు.

సృష్టిలో 'క్రమం' అనేది సున్న. శాసనం అనేది ఎండమావి. (పేమ అనేమాట పచ్చి అబద్దం. చెప్పక తప్పదంటే, స్వార్దప్రేమే తప్ప పదార్థపేమ ఈ ప్రపంచంలో లేదు. (ప్రేమ' అనే మాటకి-చంపి తినడం’ అని అర్థమైతే, సృష్టిలో కావలసినంత ప్రేమ వుంది. ఎంతసేపు మనిషికి తన తిండి, తన సుఖం, తన డబ్బు, తన కీర్తి-తనకి ఎంతవరకు ఉపయోగ పడుతుందో అంతవరకే ఆలోచన. అంతకుమించి పోడు. ఇందులో కొంచం హెచ్చు తగ్గులుండవచ్చుగాని మూలసూత్రం మాత్రం స్వార్థమే. "పరోపకారం" అనేది ఎక్కడైనా పొరపాటున వుంటే, అది కూడా ‘మారువేషం వేసుకున్న' స్వార్ధమే.

ఆపిచ్చివాడి లెక్కప్రకారం-మూలకారణమైన అనిర్వచనీయమైన మహాశక్తినుంచి అనేక అంధప్రాయాలైన శక్తులు పుట్టాయి. మనుషుల్ని పునాదుల్లోకంటూ కదిలించి ఆకారణంగా జాతులకు జాతుల్నే కూల్చేసే ప్రకృతిశక్తులివి. ఆటలమ్మ, మశూచి వంటవి జబ్బులుకావు. ఇలాంటి అకారణ, ఉన్మత్తశక్తులే. ఈసృష్టిలో క్రమం అనేది లేదు. అక్రమమే సమాజం. ఇన్ని అస్తవ్యస్తాలున్నామనదేశం ఆచారాలలో ఇంకా అనేక ఇతర విషయాలలో విలక్షణమైంది. భయంకర శక్తుల్ని సైతం దేవతల పేర్లతో పూజిస్తాం -అయినా మనుషులకి మతిలేదు అని తేల్చాడు. జంఘాలశాస్త్రి ఈఉపన్యా సంతో ఏకీభవించలేదు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

పిచ్చి యాసుపత్రిలోనిపిచ్చి లేనివానిని జూడవలయునను పిచ్చిచే దిరుగ నాతనియొద్దకుఁ బోయి నిలువబడి, "అయ్యా క్రిందటిసారి నిన్నుఁ జూచినప్పడు సృష్టిలో