పుట:SaakshiPartIII.djvu/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారికి బహిరంగలేఖ

సు.స.గారు వ్రాసినది

రైలుబండిలో దొరికిన తన ఉపన్యాసానికి పానుగంటి వారిచ్చిన సమాధానం ఏమి అర్ధవంతంగా, శాస్త్రీయంగా లేదని ఖండిస్తూ శ్రీమతి సు.స.గారు బహిరంగ లేఖ వ్రాశారు.

ఇందులో, పానుగంటివారు పురుష పక్షాన కలిగించుకొని సమర్దిస్తూ మాట్లాడినట్టు సు. స. గారు భావించారు.

ఆడది అణిగిమణిగి అణుకువతో అడ్డమైన బానిసతనం చేసినంతసేపు మగవాళ్ళు చేస్తే స్త్రీ స్తోత్రానికి హద్దు లేదు. ఎన్నో అర్హతల్ని, గొప్పతనాన్ని ఆమెకు కట్టబెడుతూ మాట్లాడడం అలవాటే. నేను శాపాలాప శారదావతారమైతే, మీరు వాదాలాప వాచస్పతులో- ఆడదాని నోట వెలువడిందల్లా తిట్టా? మగవాడు పలికినవన్నీ హేతుకల్పనలా? నావంటి ఆడది గ్రామగ్రామానికీ ఒక్కతె వుంటే, ఆర్యావర్త దేశాన్నంతనీ మూడేళ్లలో ఆడ మళయాళం చేసేయమా?-అని సు.స. గారు పానుగంటి వారిని ఈసడించారు. ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకుని, తరవాత మమ్మల్ని విమర్శించండి - అని హెచ్చరించారు. చివరకి HEREDITY విషయం గురించి పానుగంట వారి వివరణల్ని ఎత్తుకొని దాన్నొక్కదాన్నే విపులంగా విమర్శించాడు. పిల్లల లక్షణాల నిర్ణయంలో తల్లివైపు వారివీ, తండ్రివైపువారివీ గుణగణాలు పరిగణనలోకి వస్తాయన్నారు. ఒక కుటుంబంలో కలిగిన బొమ్మ తల్లిదండ్రులు మాత్రమే చేసింది కాదు, అన్నారు. ఇదే విధంగా HEREDITY విషయంలో శాస్త్రీయమైన ఉదాహరణలతో పానుగంటివారి జవాబును ఖండించి జంఘాలశాస్త్రి దీనికి జవాబు చెప్పాలని కోరుతూ ముగించారు.

య్యా!

మీకు రైలుబండిలో దొరకిన నాయుపన్యాసమునకు ఖండనముగా వ్రాసి ప్రచురించిన మీ బహిరంగలేఖను శ్రీభారతిలోఁ జాచి యానందించితిని. ప్రత్యేకముగ నాఁడువారి