పుట:SaakshiPartIII.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. “పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగునట, పలికెద వేఱొండుగాథ పలుకగ నేలా?

యను పద్యమును చదివి 'ఆహా! మహానుభావుడు! ఎంత మృదులముగా, నెంత లలితముగా, నెంత మనోహరముగాఁ జెప్పినాడో మాతండ్రి- పోతరాజుగా రిప్ప డెక్కడ నుండునో యని కన్నులనీరు జలజల రాల్చుచుండును. ఊచబియ్యపు బదనుచేఁ జొంగలు గార్చుచున్న భుక్తిప్రియులకుఁ బోతరాజుగారి కవిత్వ మప్పడు కావలయునా?

ఇట్లు కొంతకాల మత్యువ్ర్చయముగా నాసంసారమునకు దినములు జరిగినవి. కాలమొక్కరీతిగా గడచునా? వర్షమునలు వెనుక బట్టినవి. పంటలు తగ్గిపోయినవి. క్షాము తలసూపినది. అందువలన నతిథులు మఱింత వచ్చుచున్నారు. అందఱకు సంతుష్టిగా బెట్టుచునే యున్నాఁడు. అప్పలు చేసినాఁడు, పాట పెరట్లమ్మినాఁడు. ఇల్లమ్మినాఁడు. ఇంటిలో బాత్రసామగ్రి నమ్మినాడు. కోటప్పకొండ మ్రొక్కుతో సంబంధించిన తన యెడమకాలి వెండికడియ మమ్మినాఁడు. అమ్మగా మిగిలిన రెండుగేదెలు కూడజచ్చిపోయి నవి. ఇంటిలో నేమియు లేదు. మట్టమధ్యాహ్నమగుసరికిద్ద ఆతిథులు వచ్చినారు. ఇంటిలో నరసోలెడు గింజలు లేవు. అప్పడు భార్యయొద్ద కాతండు పోయి యిప్పడువచ్చిన యతిథులను బూజించు టెట్టు?-అని యడిగెను. పసుపురాచిన దారమును మెడను గట్టుకొని మంగళసూత్ర మిచ్చి “ఇది యమ్మి వారికిఁ గావలయు సామగ్రిని తెండు. అమ్మాయి చల్ది యన్నము తినినది. మన మీ దినమున భుజింపవలదు. వారికి సాయంకాలము కాకుండ భోజనము పెట్టి పిల్లను దీసికొని రాత్రి యెటకైనఁ బోవుద'మని భార్య పలికెను. మంగళ సూత్రమునకు రెండువరాలు కాబోలు వచ్చినది. కొంత వ్యయపఱచి యాయతిధు లకు సంతుష్టిగా భోజనము పెట్టి శిష్టాన్నము కొంత సాయంకాలమునఁ గూతునకుఁ బెట్టి, తాము తినక వా రారాత్రి యెవ్వరి తోడను జెప్పకుండ వెడలిపోవ బ్రయత్నించిరి. కాని, యీ యూరకున్న యొకసంపన్నుఁ డీయంశమును గర్ణాకర్షిగా విని యాయనయొద్ద కారాత్రి వచ్చి 'సుబ్బరాజుగారూ! మీకు దుర్దినములు వచ్చినవి. దరిద్రతకంటె దుస్థితిలేదు. మిమ్ము నేను గనిపట్టుదును. మీ రెక్కడికిని భోవల’దని చెప్పెను. " ఓయబ్బ! దుష్టదిన ములు మాత్రము మమ్మేమి చేయఁగలవయ్యా దరిద్రము పోతరాజుగారు పడలేదా? ఆయనకంటె మే మెక్కువ వారమా? ధర్మబుద్దిచే నొకరు నా కింత పెట్టగ నేను దినువాఁడను గాను. పోతరాజుగారిని రక్షించిన యొంటిమెట్ట కోదండ రామమూర్తి మమ్మేల రక్షింపకుం డును? అడవులఁ బట్టి పోవుదుము. నాయనా! పోతరాజుగారు “అడవి రక్షలేని యబలుండు వర్డిల్లు, రక్షితుండు మందిరమునఁ జచ్చు"నని చెప్పినారు. మ మ్మడ్డు పెట్టకుము. కాని నా దొక్క కోరికయున్నది. ఎవ్వరైన నతిథులు వచ్చునెడల బోతరాజుగారు సంతసింతురు అని చెప్పి యాతని నంపివైచి, ఇదివఱకుఁ దాను వ్రాసిన తాటాకు గ్రంథములన్నియు నటుకమీదఁ బదిలముగా దాఁచి, తాను వ్రాసిన పోతరాజుగారి భాగవతమును దేవతార్చనపుఁ బెప్టెతోఁగూడ నంగవస్త్రమునఁ జుట్టి తలపైఁ బెట్టుకొని, పోతరాజుగారి మద్దెల వీపునఁ గట్టుకొని, గంటము మొలలోఁ బెట్టుకొని, గూఁతు నెత్తుకొని, భార్యచేయి పట్టుకొని-

క. 'శ్రీకంఠచాఖండన, పాకారి ప్రముఖవినుతభండన విలస
త్కాకుత్స్థంవంశ మండన, రాకేందు యశోవిశాల రామనృపాలా!"

- యని పఠించుకొనుచు వెడలిపోయెను.