పుట:SaakshiPartIII.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. చిత్ర లేఖనము

రోజున తుంగభద్రా తీరవాసులు, చిత్రకారులు అయిన ఒక శాస్త్రిగారిని సాక్షి సంఘసభకు ఆహ్వానించి, ఆయనచేత ఉపన్యాసం ఇప్పించాడు జంఘాలశాస్త్రి.

ఆశాస్త్రిగారు ముందు చిత్రలేఖనం గురించి, స్త్రీ మూర్తులచిత్రణంగురించి కొంచం మాట్లాడారు. కొన్ని నెలలనుంచీ తాను ఆంధ్రదేశంలోని చిత్రకళాశాలల్ని చూస్తున్నాననీ, కొన్ని స్త్రీవిగ్రహాలకు పైటగాని, జాకెట్టు గాని లేవనీ, అన్ని స్త్రీ విగ్రహాలకు బొడ్డుకన్పిస్తుందనీ, మరికొన్ని విగ్రహాలకు చీరకట్టేలేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి విగ్రహాలు సంతోషం కలిగించడానికిబదులు సంతాపం కలిగించాయన్నారు. బుద్దిమంతులైన చిత్రలేఖకులు వాటిని అలా ఎందుకు చిత్రించారా! అని ఆలోచిస్తూ పడుకుంటే ఆశాస్త్రిగారికే ఒకకల వచ్చిందట. ఆకలలో అసందర్భాల్నితొలగించి సందర్భశుద్దిగా వ్రాసిందే ఈ ఉపన్యాసం.

కలలో శాస్తిగారిని ఒక పురుషుడు ఒక సభలోకి తీసుకువెళ్లాడు. అందులో శ్రోతలంతా పురుషులే. ఉపన్యాసరంగంమీద ఒక యువతి మాత్రం కుడిచేతిలో కొరడాపట్టుకుని వుంది. ఆమె తేజస్సులో సౌందర్యం కాఠిన్యం, కలగలిసివున్నాయి. ఆమె ఉపన్యసిస్తోంది. ఆడవాళ్లమర్యాద గురించి మీకేమైనా తెలుసునా? అని గద్దిస్తోంది. స్త్రీమూర్తుల్ని చిత్రించేటప్పుడు ఆర్ధదిగంబర స్వరూపాలను, పూర్తి దిగంబర స్వరూపాలను ఎందుకు చిత్రిస్తారని నిలదీస్తోంది. తనదేశంలో స్త్రీ, ఔన్నత్యం ఏమిటో, ఆమె వ్యక్తిత్వం ఏమిటో, అది స్త్రీ, మనస్సుతో అందుకుంటేనే అర్ధమవుతుందని వివరించిది. స్త్రీ, పుట్టింది మొదలు, చనిపోయేవరకు, ఏమాన మర్యాదల్ని ప్రాణంగా చూసుకుంటుందో చెప్పింది. స్త్రీ పట్ల గౌరవంకలిగి ప్రవర్తించండి అని చెప్పింది. స్త్రీపట్ల గౌరవంకలిగి ప్రవర్తించండి-అని హెచ్చరించి, కొరడాతో ఛటేల్న సభాసదుల్నికొట్టింది- అని శాస్త్రిగారు ముగించారు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నాయనలారా! మనసంఘమును దిరుగ స్థాపించినపిమ్మట రెండుపన్యానములైన నిచ్చితినో లేదో, ఇంతలోనే నంఘ వ్యాపారములకు విఘాతము తటస్థించినది. అందుల