పుట:SaakshiPartIII.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. అత్యద్భుత స్వప్నము

తాజ్‌మహల్ చూసిననాటి రాత్రి వచ్చిన కలను జంఘాలశాస్త్రి చెపుతున్నాడు.

షాజహాన్, ముమ్‌తాజ్ కలిసి అంతఃవురంలో వుండగా ఒక బంగారు చువ్వలాంటి ఒక స్త్రీ మేలి ముసుగు వేసుకుని అక్కడికి వచ్చింది. ముం తాజ్ ఆమె ఎవరని, షాజహాన్‌ను ఎక్కదీసింది. ఆమెను తాను వివాహమాడినట్టు, చక్రవర్తి నెమ్మదిగా వెల్లడించాడు. ముమ్‌తాజ్ వెంటనే కోపాన్ని వెనక్కినెట్టి ఆమెను 'చెల్లెలి'గా మన్నించింది. ఆ స్త్రీ పేరు కిన్నెత్.

చక్రవర్తి ఆ స్త్రీ, ఆ స్త్రీ అంతఃపురానికి వెళ్ళాక, ముమ్‌తాజ్ తన అసూయ వెళ్లగ్రక్కింది. కిన్నెత్‌ను అంతం చెయ్యడానికి పెద్దకుట్ర పన్నింది. ఈ కుట్రలో రోషనార కూడా ప్రముఖపాత్ర వహించింది.

కిన్నెత్, చక్రవర్తి కలిసి పక్కపై దిండు మీద ఒక లేఖ చక్రవర్తి కంటపడింది. ఆ లేఖను చక్రవర్తి చదివిన క్షణంలో కిన్నెత్ లోపలకు వెళ్లింది.

ఆ లేఖ సారాంశం ఏమంటే, కిన్నెత్ కులట అని-ఆ అంతఃపురంలో వున్న యాకుతీ స్త్రీ కాదని పురుషుడని కిన్నెత్ ప్రియుడని -

చక్రవర్తికి దారుణంగా కోపం వచ్చి కిన్నెత్‌ను చంపివేద్దామను కున్నాడు గాని, నిగ్రహించుకుని, కిన్నెత్‌నే నిజం చెప్పమని అడిగాడు. ఆమె తన శీలం నిప్పువంటిదని చెప్పింది. యాకుతీ చెప్పిన సాక్ష్యం వల్ల తన కుటుంబం వాళ్లు కిన్నత్‌కు ఎంత వ్యతిరేకంగా వున్నారో తెలిసింది. చక్రవర్తి కిన్నెత్ శీలవతేనని నమ్మిన అనంతరం, ఆమె అక్కడి కక్కడే అల్లాను తలుచుకుని తల పగలు కొట్టుకొని చనిపోయింది. షాజహాన్ మనస్సు కలిగిపోయింది.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

తాజ్‌మహలు చూచినరాత్రి నాకుఁ గలిగిన స్వప్నమును జెప్పెదనని క్రిందటిసారి చెప్పితిని. ఇప్పడ దానిని గూర్చి చెప్పెదను. స్వప్నమిట్టుండెను.