పుట:SaakshiPartIII.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాగి:- అందులకు నాది పూచీ, హిమాలయమునకు రమ్ము పోదము.

జనకచక్రవర్తి ప్రధానునితో నిట్టు పలికెను. 'నాకుఁ గొంతపని. యున్నది. నే నీమునితోఁ బోయెను. నే నెక్కడకుఁ బోయెదనో నన్ను గూర్చి యేప్రయత్నము జేయవలదు. నాయిష్టమువచ్చినప్పడు తిరుగవత్తును. నీవు నన్నేమియు నడుగవలదు.”

అట్టు చెప్పి చక్రవర్తి విరాగితోఁ బోయెను.

  • * * * * *

వారు మహారణ్య మధ్య భాగమున నడచుచున్నారు. చక్రవర్తికమితమగు దగవేసెను. చుట్టుపట్టుల మంచినీరము దొరకదయ్యెను. నే నెచ్చటికైనఁ బోయి తెచ్చిపెట్టెదనని విరాగి చెట్టుక్రింద నాతనని బండ పెట్టి పోయెను. రాజునకు విస్తృతి కలిగెను. ఇంతలో జనకచక్రవర్తి యొక్క సామంతరాజోకఁడు తనకొడుకులను జక్రవర్తికిఁ జూపించుతలంపుతోఁ గొంత సైన్యముతో భటులతో నాశ్వికులతో సమస్తసామగ్రీ సమృద్దితో బయలుదేఱి జనకచక్రవర్తి పండుకొన్న చెట్టుక్రింద నుండి పోవుచు నామహాతేజమును చక్రవర్తి యని యెఱఁగియుండు టచే నీమహానుభావుఁ డిక్కడ పడియుండుట కేమి కారణమో యని తెల్లపోయి యాతనియుద్ద గూరుచుండి తన వైద్యులను బిలిపించి చక్రవర్తికి దాహ శాంత్యాదులను జేయించెను. నిద్దుర మెలకువరాకుండ నిమ్మళముగ బట్టుపఱపులపై నాతని నుంచిరి. పైన తన పెద్ద డేరా వేయించి డేరా చుట్టు భటులను గుఱ్ఱపుసవారులను గాఁపుగాయుచుండ నాజ్ఞాపించెను. తాపశాంతి కొఱకుఁ బన్నీరు భూమిపై జల్లించుచుండెను. పూవులసురట లతో దాసీ జనముచే విసరించుచుండెను. నిమ్మళముగ మెలఁకువ కలుగుటకై మిక్కిలి సున్నితముగ వీణావాదనము జేయించుచుండెను. మహాచక్రవర్తి యారోగ్యమునకై ద్విజులచేఁ బ్రార్ధనలఁ జేయుచుండెను. ఒక్క గంటలోపల నిన్ని మార్పులు జరిగెను. అడవి పట్టణమయ్యెను. ఎందుచేత? ఇన్ని సౌఖ్యములు పొందవలసిన వాడరణ్యమున నుండుట చేత.

రాజునకు మెలఁకువ కలిగినది. సామంతరాజుచే సంగతులన్నియుఁ దెలిసికొనెను. ఒకముని యెవరైన నాకొఱకు వెదకుచున్నారేమో కనుఁగొనమని చక్రవర్తి యాజ్ఞయయ్యెను. లోనికి వచ్చెదనని యెంత సేపటి నుండియో యఱచుచున్న సన్యాసియొకఁడు వెలుపల నున్నాడు. సెలవు లేకపోవుటచేత రానీయలే దని యచ్చటివా రెవ్వరో చెప్పిరి. ముని లోనికి వచ్చి బంగారుపీఠముపై గూరుచుండి తనకుఁ బాదాక్రాంతులైన సామంత రాజపు త్రుల నిద్దఱ నాశీర్వదించుచున్న చక్రవర్తిని గాంచి 'కర్మయోకి చక్రవర్తీ నావలన మహాపరా ధము గలిగినది. నాకు బుద్ది వచ్చినది. నన్ను కమింపు'డని బట్ట మెడ జట్టుకొని సాష్ట్రాంగపడెను. ఈసన్నివేశ మచ్చటివారి కెవ్వరికిఁ దెలియలేదు. మునిని లేవనెత్తి నీవు మఱేమియు ననుకొనవల దని చెప్పి యాతనిని వినమ్రుఁడై యనునయించి సామంత రాజపరివారముతో, విరాగితోఁ దనరాజ్యమునకుఁ బోయెను.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః