పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారఁ జెలంగి పొంగెడునపారనిధిఁ గన్గొని రవ్వధూవరుల్.

165


సీ.

వృద్ధాంగనకు యువప్రియుఁ డబ్బెఁ బో యని, నగియెడులీల ఫేనములు గ్రాల
నజుచెయ్వు లిట్లె పో యని తద్ద ఘూర్ణిల్లు, జాడల నిబిడఘోషములు మీఱ
మునిదంపతులఁ గరంబులు చాఁచి డాయంగఁ, బిలుచుచందమున వీచులు దనర్పఁ
దగువారి కర్ఘ్యపాద్యము లిచ్చువడువున, శీకరాసారము ల్చిందుచుండ


తే.

వినయగతి వారలకు నెమ్మి విశ్రమింపఁ, బీరము ల్పెట్టుచాడ్పునఁ బృధులసైక
తములు రాణింప సొంపునఁ దనరుచున్న, యప్పయోరాశిఁ దఱిసి రయ్యలఘుమతులు.

166


సీ.

ఘనులఁ బ్రపూర్ణజీవనులఁ జేయువదాన్యుఁ, డవిగతామితబాడబాశ్రయుండు
తవిలి మర్యాద దాఁట కుండుఘనుండు, బహుతరవాహినీపరివృతుండు
ధీవరకోటి కధీన మౌధన్యుండు, సదమలగాంభీర్యసంయుతుండు
సరసపురోహితసమితి కాకరసీమ, భువనాంతరవ్యాప్తభూరికీర్తి


తే.

యహిమకరధాముఁ డసదృశోదగ్రరత్న, కంకణమహోర్మికోద్భాసికనిహితుండు
నగురసాధీశుఁ డెంతయు నబ్బురంపు, సంతస మొనర్చె నప్పు డాదంపతులకు.

167


వ.

అట్లు సముద్రదర్శనం బొనర్చి యుప్పొంగుచు.

168


మ.

“దళితాశేషమహాంహసే ఘనపయోధామ్నే సముద్రాయ శై
వలినీమండలనాయకాయ వరుణావాసాయ పద్మాలయా
లలనేశశ్వశురాయ పుణ్యనిధయే లావణ్యపూర్ణాయ ని
స్తులగాంభీర్యయుతాయ తే నమ" యటంచు న్మ్రొక్కి మోదంబునన్.

169


తే.

అవ్వధూవరు లందుఁ గృతావగాహు, లై రయంబునఁ జని యగస్త్యాశ్రమంబు
చేరి యమ్ముని నాన దర్శించినపుడు, గౌతముం డాయనకు మ్రొక్కి కడఁకఁ బలికె.

170


తే.

మునికులోత్తమ భువి భుక్తి ముక్తిదంబు, నఖిలవాంఛాప్రదంబు నైనట్టి పుణ్య
తీర్థ మెయ్యెది నాడెంపు, దేశ మెద్ది, తేటతెల్లంబుగా మాకుఁ దెలుపవలయు.

171


క.

అని ప్రార్థించిన గౌతముఁ, గనుఁగొని నెయ్యంబుతో నగస్త్యుఁడు వలికెన్
మునివర గౌతమి యఖిలవృ, జినములు దొలఁగించు నిష్టసిద్ధియుఁ జేయున్.

172


తే.

ధరణి నెన్నికఁ గన్న తీర్థముల కెల్ల, మిన్న యై గౌతమీగంగ వన్నె కెక్కు