పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమ__ఈ పాకము దివ్యముగా నున్నది. దీనిముందఱ నలభీమపాకములెందుకు ?

వెంక__సోమయాజులుగారూ! నిన్న సత్రములో వండిన బీరకాయ యింతరుచిగా లేదు సుండీ!

రాజ__ఏ సత్రము?

వెంక__నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటి యింట గృహప్రవేశమునకు సంతర్పణ జరిగినది. బొల్లి పేరయ్యగాఁడు వంట చేసినాఁడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపఙ్క్తి నే కూరుచున్నాము.

ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనముచేసి యందఱును పడమటింటిదొడ్డిలో చేతులు కడుగుకొని తేన్చుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలోఁ గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్టమొదట నాలుగు దినము లుండఁదలఁచు కొనియే వచ్చినను, భోజన సమయమున జరిగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడుగకయే వెంటనే తాంబూలమును బుచ్చుకొని నడచిరి.