పుట:Prasarapramukulu022372mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ప్రసార ప్రముఖులు.

శ్రీ వింజమూరి వరద రాజ అయ్యంగార్:

సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు వింజమూరి వరద రాజయ్యంగార్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో కర్ణాటక సంగీత విభాగం అసిస్టెంటు ప్రొడ్యూసస్ర్ గా 1965 నుండి ఒక దశాబ్ది కాలం పని చేశారు. వీరిది గుంటూరు జిల్లా. గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన వీరి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాల రూపొందించాయి. వీరు 1994 ప్రాంతంలో కాలధర్మం చెందారు. వీరి కుమారులు శ్రీ వి. గోవింద రాజన్ I.A.S అంధ్ర రాష్ట్ర ప్రభుత్వ్ కార్యదర్శిగా వ్వవహరించారు. కేంద్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

డా. మంచాల జగన్నాథరావు:

వైణికులుగా జగన్నాథరావు సుప్రసిద్ధులు. వీరి సోదరులు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి హైదరాబాదులో కలసి పని చేశారు. జగన్నాథరావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆతర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రిటైరయ్యారు. జగన్నాథరావు హైదరాబాదులో పరమ పదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వారు. అలహాబాదు పాట్నా కేంద్రాలలో హిందూస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. వయోలిన్ విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు.

N.S.శ్రీనివాసన్:

T.S. మహాలింగం శిష్యులుగా వేణునాదంలో ప్రసిద్ధులు. శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వేణుగానం ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలు పని చేశారు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీనివాసన్ అనేక రూపకాలను ఆకాశవాణిలో సమర్పించారు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పని చేసి పదవి విరమణ చేసారు.

వీరి సతీమణి శారదా శ్రీనివాసన్ అద్భుతగాత్ర సౌందర్యంగల వ్వక్తి. ఆమె హైదరాబాదు కేంద్రంలో డ్రామా వాయిస్ గా మూడు దశాబ్దాలు పైగా పనిచేసి 1996 లో రిటైర్ అయ్యారు.