పుట:Prasarapramukulu022372mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

29

డా. వింజమూరి సీతా దేవి:

జానపద విభాగములో ప్రొడ్యూసర్ గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసిన సీతాదేవి ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేన కోడలు. వింజమూరి సీత, అనసూయ అక్క చెల్లెండ్రు. ఇద్దరూ జానపద గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణాలో అనేక ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలకు ప్రాణం పోశారు. సీతా దేవి స్వయంగా గానం చేస్తారు. జానపద గేయాలు సంకలన రూపంలో వెలువరించారు. 1984 లో సీతాదేవి పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు. భక్తి - ముక్తి, లాలి-తాళి పేర జానపద గేయాలు ప్రచురించారు. కొంత కాలం మదరాసు కేంద్రంలో పనిచేశారు. వీరికి కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ యిచ్చి సత్కరించింది.

శ్రీమతి సునందినీ ఐప్:

అనంతపురంలో 1926 నవంబర్ లో జన్మించారు. బి.ఎ. బి.యిడి పూర్తి చేసి కొంత కాలం అధ్యాపకులుగా పని చేశారు. 1972 లో ఆకాశవాణి హైదరబాదు కేంద్రంలో విద్యాప్రసార విభాగంలో ప్రొడ్యూసర్ గా చేరారు. విద్యాప్రసారాలను పటిష్టం చేసి బహుళ జనామోదం చేయడంలో కృతకృత్యులయ్యారు. విద్యాశాఖతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని విద్యాప్రసారాల రూపకల్పనలలో కొత్త ఒరవళ్ళు సృష్టించారు. ఎన్.వి.ఎస్. రామారావు (అనౌన్సర్)గా వీరి శాఖకు సహకారాలందించారు. ఆయన 1995 లో హృద్రోగంతో హఠాన్మరణం చెందారు. రామారావు చక్కటి నటుడు. ఈల పాట రఘురామయ్య సన్నిహిత బంధువు. సునందిని 1984 నవంబరులో స్టేషన్ డైరక్టర్ గా మైసూరులో పదవీ బాధ్యతలు స్వీకరించి అదే నెలాఖరులో పదవీ విరమణ చేశారు. ఆమె ఇప్పుడు హైదరాబాదులో స్థిరపడ్డారు. చక్కటి వాచకం గల వ్వక్తి సునందిని.

పండు ధర్మజ్ఞాని:

కృష్ణా జిల్లా వాసి అయిన ధర్మజ్ఞాని తొలి నాళ్ళలో పనిచేసిన వారిలో ప్రథములు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా చేరి విజయ వాడ, హైదరాబాదు, డిల్లీ, జమ్మూ, జైపూర్ లలో పని చేశారు. బెంగుళూరు కేంద్రం డైరక్టర్‌గా కొంత కాలం పనిచేసి పదవీ విరమణ చేశారు.