పుట:Prasarapramukulu022372mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

31

పాలగుమ్మి విశ్వనాథం :

పాలగుమ్మి విశ్వనాథంగారు లలిత సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసి 1982లో పదవీ విరమణచేసారు. కర్ణాటక లలిత సంగీతకచేరీలు నిర్వహించటంలో విశ్వనాథం ప్రవీణులు. వీరు లలిత సంగీతానికి చక్కని ఒరవడి పెట్టారు. వీరి సంగీత నిర్వహణలో అనేక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీరి తర్వాత M చిత్తరంజన్ ఆ బాధ్యతలు స్వీకరించారు. చిత్తరంజన్ ఈ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీణ ఆర్టిస్టుగా మొదట చేరారు.

S. రాజారాం :

ప్రముఖ మృదంగ సంగీత విద్వాంసులు రాజారాం. వీరు మైసూరు వాసుదేవాచారి మనుమలు. ఆర్టిస్టుగా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా వివిద కేంద్రాలలో పని చేసారు. ఢిల్లీలో సంగీత విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. 1981లో హైదరాబాదు కేంద్ర డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి 1983 జనవరిలో రిటైరయ్యారు. ప్రస్తుతం వీరు మదరాసు కళాక్షేత్రంలో ప్రిన్సిపాల్ గా ఒక దశాబ్దిగా పనిచేస్తున్నారు. వీరి సోదరులు యస్ కృష్ణమూర్తి మైసూరు కేంద్రం డైరెక్టర్ గా రిటైరయ్యారు.

చెరుకుమిల్లి భాస్కరరావు:

హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్(Scripts)గా పని చేసారు. రచయత , కళాకారుడు అయిన భాస్కరరావు దూరదర్శన్ కేంద్రంలో కూడా పని చేసారు.

మొదలి అరుణాచలం:

రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి ఆకాశవాణి కేంద్రంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ గా రెండు దశాబ్దాలు 93లో పదవీ విరమణ చేసారు. కధా రచయత, రూపక రచయత అరుణాచలం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు బహుళ జనామోదం పొందడానికి కృషి చేసారు. వీరొక కథల సంపుటి ప్రకటించారు. వీరి కుమార్తె ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పని చేస్తున్నారు.

శ్రీమతి తురగా జానకీరాణి:

తురగా కృష్ణమోహన్ హైదరాబాదు వార్తా విభాగాదిపతిగా పనిచేసి అకాల మరణం చెందారు. వారి సతీమణి జానకీరాణి 1975 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో women & children ప్రొడ్యూసర్ గా చేరారు. అంతకు ముందు రాష్ట్ర