పుట:Prabodhanandam Natikalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ॥ (3)

ఉపదేశ మిత్తుమంచు వూరూరా తిరుగుతారు
దండిగ ధనమిచ్చునోళ్ళ తన శిష్యులంటారు
గొప్పస్వామి వంచు మ్రొక్క అబ్బరాని కుబ్బుతారు
తత్త్వమిప్పి జెప్పమంటే తైతక్కలాడుతారు ॥జీవు॥


చంద్రం :- రావయ్య రా! దేవుడేలేడు, దేవుడుంటే చూపండి అని అందరి ముందు అరుస్తూవుంటావు నీనాస్థికవాదనికి పులిస్టాప్‌పడుతుంది రా.

కామేశం :- నా నాస్తికవాదానికి పులిస్టాప్‌ పెడతారా! ఎవరు ఎక్కడ, ఎక్కడ ఆ మగధీరుడు? నాముందుకువచ్చి నిలబడి మాట్లాడమను దమ్ముంటే.

వేణు :- కల్లుసారాయి త్రాగినావా కామేశం మామయ్య, అలా చిందు లేస్తున్నావ్‌ ఆ మగధీరుణ్ణి నేనే.

కామేశం :- పిల్ల కాకికేమి తెలుసు తోడేలు దెబ్బ. నీవు నా నాస్తికత్వాన్ని నాస్తి చేయగల పురుష పుంగవునివా, నా మూడు ప్రశ్నలకు జవాబు చెప్పగలవా.

వేణు :- చెప్పగలిగితే?

కామేశం :- నీవు సరియైన సమాధానాలు చెప్పితే, ఇప్పుడే నా నాస్తికత్వాన్ని వదలి ఆస్థికత్వం చేపడతా. మొదటి ప్రశ్న జీవుడెవరు? ఎక్కడుంటాడు? ఏ పని చేస్తుంటాడు?

వేణు :- జీవుడు పరమాత్మయొక్క అంశమువాడే. అయినా ప్రకృతి ప్రభావానికిలోనై కర్మలో బంధింపబడివున్నాడు. జీవుడు ప్రతిప్రాణి తలలో గుణచక్రంలో, గుణాలమధ్యలో, వాటితో సంబంధము పెట్టుకొనివుండి గుణాలు చేయించే పనులయొక్క సుఖదుఃఖ కర్మలను అనుభవిస్తుంటాడు.