చ॥ (3) | ఉపదేశ మిత్తుమంచు వూరూరా తిరుగుతారు | |
చంద్రం :- రావయ్య రా! దేవుడేలేడు, దేవుడుంటే చూపండి అని అందరి ముందు అరుస్తూవుంటావు నీనాస్థికవాదనికి పులిస్టాప్పడుతుంది రా.
కామేశం :- నా నాస్తికవాదానికి పులిస్టాప్ పెడతారా! ఎవరు ఎక్కడ, ఎక్కడ ఆ మగధీరుడు? నాముందుకువచ్చి నిలబడి మాట్లాడమను దమ్ముంటే.
వేణు :- కల్లుసారాయి త్రాగినావా కామేశం మామయ్య, అలా చిందు లేస్తున్నావ్ ఆ మగధీరుణ్ణి నేనే.
కామేశం :- పిల్ల కాకికేమి తెలుసు తోడేలు దెబ్బ. నీవు నా నాస్తికత్వాన్ని నాస్తి చేయగల పురుష పుంగవునివా, నా మూడు ప్రశ్నలకు జవాబు చెప్పగలవా.
వేణు :- చెప్పగలిగితే?
కామేశం :- నీవు సరియైన సమాధానాలు చెప్పితే, ఇప్పుడే నా నాస్తికత్వాన్ని వదలి ఆస్థికత్వం చేపడతా. మొదటి ప్రశ్న జీవుడెవరు? ఎక్కడుంటాడు? ఏ పని చేస్తుంటాడు?
వేణు :- జీవుడు పరమాత్మయొక్క అంశమువాడే. అయినా ప్రకృతి ప్రభావానికిలోనై కర్మలో బంధింపబడివున్నాడు. జీవుడు ప్రతిప్రాణి తలలో గుణచక్రంలో, గుణాలమధ్యలో, వాటితో సంబంధము పెట్టుకొనివుండి గుణాలు చేయించే పనులయొక్క సుఖదుఃఖ కర్మలను అనుభవిస్తుంటాడు.