పుట:PandugaluParamardhalu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్యేష్ఠశుద్ధ త్రయోదశి

     జ్యేష్ఠశుద్ధ త్రయోదశి మూడు వ్రతాలు చేసే ముహుర్తదినంగా చతుర్వర్గ చింతామణి చెబుతూ ఉంది.  ఆ మూడు వ్రతాలలో ఒకటి దుర్గంధ దౌర్బాగ్య్హ నాశన త్రయోదశీ వ్రతం, మిగతా రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రులు పర్యంతం పర్యాస్తమైసాగేవి.  ఆ వ్రతాల నామాలు జాతి త్రిరాత్రివ్రతము, రంభాత్రిరాత్రి వ్రతము అనీ, ఇందు రెండవ వ్రతంలొ ఈనాటి రాత్రి ప్రారంభించి అరటి చెట్టు కింద ఉమా మహేశ పూజ చేయాలని కలదు.
  పైన పేర్కొన్న మూడు వ్రతాలకు ముఖ్యదినం కావడం చేతనే కాకుండా ఈనాడు మది ఒక విషయం చేతకూడా పావిత్ర్య్హాన్ని కూర్చుకున్నది.  అది జ్యేష్ఠశుద్ధత్రయోదశి విద్యారణ్యారాధవ్దినం కావడం.
   విద్యారణ్యస్వామి సిద్ధి పొందిన దినము జ్య్హేష్ఠ ద్రాదశి అని కొన్ని గ్రంధాలలో చెప్పబది ఉంది.  విద్యారణ్య్హుల జీవిత చరిత్ర విషయంలో కొంత కృషిల్ చేసిన శ్రీ మిన్నికంటి గురనాధశర్మకు వ్రాయగా వారు కొంతకృషి చేస శ్రీ మిన్నికంటి గురునాధశర్మకు వ్రాయగా వారు 28--4-61 తేదీని లేఖా మూలమున నిట్లు తెలిపిరి. "విద్యారణ్య్హులు వారి జననము 1267 లో సన్యాసము తీసికొన్నది 1331లో, సిద్ధి 13896లో వారు 1331 ప్రజోత్పత్తి సవంత్సర కార్తిక శుద్ధ సప్తమినాట శృంగేరి పిఠాధిపత్యము వహించిరి.  1386 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ సోమవారము బ్రహ్మైక్ర్యమొందిరి.  పదిరోజుల క్రిందట శ్రీశ్రింగేరి పీఠాదిపతులు 35 వ విద్యాతీర్ధ స్వాముల వారితో ప్రస్ంగించు సందర్బమున వారిట్లనిరి. నేటికిని మా పీఠమున జ్యేష్టశుద్ధత్రయోదశిని విద్య్హారణ్యారాధన మొనర్తుము".
  విద్యారణ్యుడు విఖ్యాత పురుషుడు, మహాయోగి,తత్త్యార్ద కోవిదుడు, వేదత్రయ భాష్యకర్త మహామతి, సాంఖ్యయోగ రహసజ్ఞడు. బ్రహ్మవిద్యా పరాయణుడు.  శ్రౌతస్మాత్రక్రియసపరుడు, వేదాంత శాస్త్రాన్ని అనేక గ్రంధాలు రచించాడు.  విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యమును నిర్మించాడు.  లౌకిక వైరికముల రెండింటి యందు అసమాన ప్రతిభ చూపినవాడు. మతోద్దారకుడు, రాజ్యోద్దారకుడు కూడ నయిన ఈతని చరిత్ర ప్రతివారును తెలుసికొనతగినది.
    సాధాణంగా ఈతని విద్యారణ్యస్వామి అని పేర్కొంటారు.  ఈ పేరు ఇతను సన్యశించిన తరువాత వడుకలోకి వచ్చింది.
  ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవుడు అని, సన్యాస<