పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

వంటి నాయకులు, నరాలశెట్టి దేవేంద్రుడు, రాయిడు గంగయ్య, అత్తిలి సూర్యనారాయణ, గొట్టముక్కల వెంకన్న మొదలుగు హరిజన నాయకులతో కలసి జిల్లా అంతా హరిజనోద్యమ కార్యక్రమాలు, అస్పృశ్యతా నివారణ సభలు, మద్యపాన నిషేధప్రచార సభలు నిర్వహించి, హరిజనులలో ఆత్మస్టెర్యాన్నినింపారు. జిల్లా వివిధ తాలూకాలలో కల్లు పాటలు జరుగకుండా నివారించారు. మద్యపానము వలన కలిగే అనర్గాలను ఉపన్యాసముల ద్వారా, నాటకముల ద్వారా, కరపత్రముల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. గాంధీజీ పర్యటన వలన జిల్లా ప్రజానీకంలో నూతనచైతన్యం ఏర్పడినది. ఆయన భగవంతునిగాను, ఆయన వాక్కు దైవ వాక్కుగా భావించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు తీసిపోనివిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఉన్నతస్థాయిలో జరిగింది. గాంధీజీ సందర్శనతో స్పూర్తినొంది దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచారి మొదలగు నాయకులు గాంధేయవాదులై జాతీయోద్యమంలో ప్రవేశించి జిల్లాలో శాంతియుత, అహింసా విధానాల ద్వారా ఉద్యమాన్ని నడిపించారు.

බුදුහිරිපථ

 :

1. ఆంధ్రపత్రిక, ఏప్రియల్ 7, 1921. గురువారము, పే-6, కా-1.

2. పే-6, కా=1&2

3. తల్లాప్రగడరామారావుకి మహాత్ముని ఉపదేశములు, (జీవిత సంగ్రహము), జన్మభూమి గ్రంధమాల, మచిలీపట్నం, 1922 పే- 112 & 113 మరియూ ఆంధ్రపత్రిక, ఏప్రియల్-7, 1921. గురువారము, పే-6, కా-2

4. ఆంధ్రపత్రిక– ఏప్రియల్-7, 1921. గురువారము, పే-6, కా-2

5.ఆంధ్రపత్రిక- ఏప్రియల్ 11, 1921, సోమవారం, పే-8, కా-2

6. ఆంధ్రపత్రిక-ఏప్రియల్ 6, 1921. బుధవారం, పే-9, కా-3 మరియుపే-10,కా-1.

7. Young India, April 9, 1921. & eso(5.635, 33 dóe5 16, 1921.

శనివారము, పే-7 పేజీ పూర్తి