ఈ పుట ఆమోదించబడ్డది
158
వాజ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపు కవిత్వం
"పురుషస్య ధర్మనార్ధం కైవల్యార్ధం తధా ప్రధావస్య
సంగ్వంధనదుభయోరపి సంయోగ: తత్ కృత:వర్గ:" (పా కా)
"అందేన పంగు: స్కంధమారోపిత: ఏవం శరీరారూఢ
సబ్గుదర్శితేన మార్గేలు అంధో యాతి పంగుశ్చ అంద
స్కంధారూడ: ఏవం పురుపే దర్శశక్తిరస్తి పంగు
వన్న క్రియా ప్రధావే క్రియాశక్తిరస్తి అందవన్న దర్శనశక్తి:"
(గౌ పా)
(పురుషుడు దర్శనార్ధం ప్రధానం కైవల్యార్ధం, పరస్పరంకూడుతున్నారు. వీరిద్దరికి కంటికి గుడికి కలిగినట్లు సంయోగం కలుగుచున్నది. ఈ సంయోగంవల్ల యేర్పడ్డది సృష్టి)అని
(అంధుడు కుంటిని బుజమెక్కించుకొన్నాడు.కుంటివాౠ వానిని మార్గాన అంధుడు నదుస్తాడు. అంధుడి బుజమెక్కిన కుంటిగూడా నడిచ్నవాడవుతున్నాడు. ఇట్లా కుంటికివలె ప్రధానానికి క్రియాశక్తిలేదు. అంధుడికెవలె ప్రధానానికి క్రియాశక్తివున్నది. గాని దర్శనశక్తి లేదు0 అని
ఈశ్వర కృష్ల్ణసాంఖ్య కారికలోను గౌడపదభాష్యంలోను వున్న సంగతిని తెలిపి భారతీయసంస్కారం ఆంధ్రులకువుంటే యిట్లాటి నూతన చిత్రాలు బంగాళీలకంటె యెక్కువవా చిత్రించగలరన్నాను.
ఇప్పుడు బారతీయవిజ్ఞానం సంస్కృతభషలోగుప్తమైవున్నది ప్రస్తుతం భారతీయసంస్కారంతొ అంటే సంస్కృతంతో యేమత్రమైనా పాఠశాలల్లో కళాశాలల్లో బహువిద్యార్దులకు పరిచయం కలిగించే విద్యాక్రమం అత్యంతం అవశ్యకం ఉదాత్తవాజ్మయంగల ప్రసిద్దప్రాచీన బాషల్లో దేనికైనాపాఠశాలలో గాని కళాశాలలోగాని విద్యార్ధి చదివి తీరవలెననే యేర్పాటుంటేనే గాని ఆడశ సిద్దింఛదు.