పుట:Neti-Kalapu-Kavitvam.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


గాక సాధారణ పద్య కృతుల్లోను, గద్యకృతుల్లోను ఇతిహాసాల్లోను ఈ పని విపులంగా కనబడుతున్నది.

"దుష్టకీర్తనకాంతార దూరగమన
 పాంసుల యగువాక్కు పరిశుభ్రపఱతు నిక
 హరి కథాలాపగంగ రంగమ్మతల్లి
 హేమకల్పకవల్లి సాధ్విమతల్లి"

అని జీవయాత్రలో శ్రీ కంచనపల్లి కనకమ్మవారు తన పద్యంగా వ్రాశారు.

"అసత్కీర్తనకాంతార పరివర్తనపాంసులాం
 వాచం శౌరి కథాలాపగంగయైవ పునీమహే."

అని శ్రీ భాగవతకర్త వ్రాసిన దాన్నే యీమె తనదిగా వ్రాసుకొన్నది. ఆంధ్రుల్లో చాలాకాలం నుండి వున్న యీ పేరు చెప్పకుండా యెత్తి వ్రాసుకొనే పాడు ఆచారం నేటి కాలానా విస్తరించింది. తక్కినవాటిని విస్తర భీతి చేత యిక్కడ ఉదాహరించక వదలుతున్నాను.

సంప్రదాయావిచ్ఛేదానికి విద్యానాథాదుల వంటివారు స్వీకరించిన ప్రసిద్ధ శాస్త్రపంక్తుల విచారణ యిక్కడ ప్రసక్తించదు. ఆ శాస్త్ర గ్రంథాల్లో సయితం సాధారణంగా "ఇతి భాష్యకారః, ఇతివృత్తికార, లోచనకారైరుక్తం తదుక్తందండినా" అని యిట్లా తాము స్వీకరించిన వాటి కర్తలను తెలుపుతూనే వచ్చారు. సూత్రకర్తలు సయితం ఇతరుల అభిప్రాయాలను తెలిపినప్పుడు వారి పేర్లు ఉదాహరిస్తూ వచ్చారు. రఘువంశానికి అన్వయబోధిని వ్రాసిన శారదారంజన రాయలవారు.

"ఇంద్రో వహ్నిః పితృపతి ర్నైఋతిర్వరుణోనిలః
 ధనదః శంకరశ్చైవ లోకపాలాః పురాతనాః"