పుట:Neti-Kalapu-Kavitvam.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోషసామ్యాధికరణం

253


అనే అగ్ని పురాణశ్లోకాన్ని "అథనయనసముత్థం" అనే శ్లోకం కింద ఉదాహరిస్తూ రాధాకాంతులవారు కల్పద్రుమంలో ఉదాహరించినదాన్ని స్వీకరించానని తెలిపినారు. అగ్నిపురాణంలో దీన్ని శారదారంజనుడు తానే చూసినట్లు ఉదాహరించలేక కాదు. రాధాకాంతు డుదాహరించినది చూసి ఉదాహరించాడు గనుక అట్లా తెలిపి విద్యాకృషి గౌరవం కనబరచాడు. ఇక ప్రకృతానికి వస్తాను.

ఉక్తవిధాన ఇతరుల నుండి రచనలను గ్రహించి వారి పేరు చెప్పకుండా తాము వ్రాసినట్లు ప్రకటించి ఆత్మవంచన లోకవంచన చేయడం మనదేశంలో చిరకాలం కిందనే ఆరబ్దమయి యిప్పుడు మితిమీరి పోయించి. ఇట్లా యిప్పుడు దొంగిలించి అసలు వారిపేరు చెప్పకుండా వ్రాసిన రచనలను రచనైక దేశ-----, తెలియక పోవడం చేత పత్రికల ప్రవర్తకులు కృతిపతులు ఆ వ్రాతలను అట్లానే ప్రకటిస్తున్నారు. అవి కృతికర్తలవనుకొంటున్నారు. ఆర్జవం, సత్య పరాయణత వదలి పరిణతి లేని రచయితల భారతీయ సాహిత్యతత్వానికి అంధులైన పద్యకర్తలు స్వకీయ విచారణలేని వ్యాఖ్యాతలు అనేకులు ఈ తీరుగా బయలుదేరి దేశాన్ని దేశం యొక్క విజ్ఞాన వికాసాన్ని వంచిస్తున్నారు. కొందరు హీందీలో యేదో చూసి ఇది వకకొత్తగా వుంటుందని దీనితో మనం కొంత పేరు సంపాదించవచ్చునని దాన్ని పత్రికలో వేసి సంతొషిస్తున్నారు. బంగాళీలో యేదో చూసి దీనితో కొంతపేరు పొందవచ్చునని దాన్ని పత్రికల్లో పడుతున్నదని నాకు కీర్తి వస్తున్నదని యెవరి బులుపు వారు తీర్చుకొంటున్నారు. గాని అందువల్ల దేశానికి దేశీయులకు దేశ విజ్ఞానానికి జరిగే వంచన తెలిసికొనడం లేదు.