పుట:Neti-Kalapu-Kavitvam.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం

(లాటస్తీ నేత్రపుటాలను కుండలవంటి స్తనాలను నర్మదానదీతీరానవున్న పొదరిండ్లను, చందనవృక్షాలను, వర్ణిస్తూ మూఢులు కవులు దినాలు గడుపుతారు) అని ఒకరు కావ్యకోటినే నిరసించారు.

"న చ సభ్యేతరవాదచుంచవః" (త్రిశతి)

(సభ్యేతరమైన వాక్కులను చెప్పడంలో నిపుణులంగాము) అని భర్తృహరి కవులమాటలను నిరసిస్తున్నాడు.

ఈ పశుకృత్యాలను ఆధారం జేసుకొని పరిణతబుద్దులు కావ్యంలో ప్రవృత్తులుకావడం అనుచితం. పశుత్వాన్ని అణగదొక్కడానికే భారతీయ విజ్ఞానమంతా సర్వశక్తిని వినియోగిస్తున్నది. యోగసాంఖ్య వేదాంత ప్రముఖశాస్త్రాలు ఈపనికే యత్నిస్తున్నవి. అట్లాటి స్థితిలో కవులు లోకాభ్యుదయ హేతువులైన ఆమహాప్రయత్నాలకు తోడ్పడడానికి బదులు పశుత్వాన్ని ప్రేరేపించే కామాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తించడం సర్వధా అప్రశస్తం. కనుక శృంగారం యెంతమాత్రం గ్రాహ్యంకాదు అని అంటే.

సిద్ధాన్తం.

చెప్పుతున్నాను; భోజనాన్ని ఆధారంజేసుకొని కావ్యం వ్రాయనట్లే కామాన్ని ఆధారం చేసుకొని కావ్యం వ్రాయరాదనడం సరిగాదు. భోజనం. సంభోగేచ్ఛ. నిద్ర, భయం, ఇవన్నీ పశుకృత్యాలన్న మాట సత్యం. అయితే జగత్సంతతికి, అంటే, జగత్తుయొక్క అవిచ్ఛిన్నతకు, భోజనభోగేచ్ఛలు రెండూ ప్రధానమైనవిగా వున్నవి.

"బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్."

అని వాక్యాలతో జన్మపరంపరను ఆపి జగత్తును విచ్ఛిన్నంజేసే బ్రహ్మ మీమాంసా మార్గ మొకటి వున్నా,

"ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీః" (తైత్తి.)