పుట:Neti-Kalapu-Kavitvam.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

వాజ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం



"ఇత్యుక్తదిశోద్రేకం ప్రాప్య రసస్య ప్రాధాన్యేపి ఆపాతతో యత్ర ప్రాధాన్యేన అభివ్యక్తో వ్యభిచారిణః స భావః"

—-, (సాహి)

(రసం ప్రధానమయినా ఉద్రేకంపొంది రసంకంటెయెక్కువప్రధానంగా విషాదాదులు అభివ్యక్తమయితే దానికి భావమని పేరు.)

అని సాహిత్యదర్పణకారుడు తెలుపుతున్నాడు --ఇతడే

"వాక్యం రసాత్మకం కావ్యం"

—-, (సాహి)

ఆని చెప్పి

"రస్యత ఇతి రస ఇతి వ్యుత్పత్తి యోగాతో భావతదాభాసాద యోపి గృహ్యంతే"

—-, (సాహి)

అని విశదపరచాడు. రసాత్మకకావ్యం భావాత్మకకావ్యం అనియీ తీరున భేదాలను విశ్వనాధుడు తెలుపుతున్నాడు. భగవంతుడి మీద గురువులమీద -తండ్రిమీద మిత్రుడిమీదావుండే ప్రేమకు భావమని పేరు. "ఆది. వ్యక్తమయ్యేకావ్యం భావాత్మకకావ్యం, భావకావ్యం, భావధ్వని,అని వ్యపదేశం పొందుతున్నది.

పూర్వపక్షం.

అవునయ్యా, మీరు సంస్కృతం నుండి భావకావ్యం ఉదాహరించారు. మే మనేది తెలుగులో భావకావ్యం కొత్తదని. సంస్కృతంతో మనకు పనేమిటీ? సంస్కృతం బంగాళీలు మహారాష్ట్రులు మొదలైనవారిది. దానితో మనకు పనిలేదు. మావి తెలుగువాట్లో కొత్తరకం అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను. మనము.. భారతీయులం.. సంస్కృతంమమీద బంగాళీలకు మహారాష్ట్రులకు యెంతహక్కువున్నదో మనకూ అంతే