పుట:Neti-Kalapu-Kavitvam.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


"......శేఫాలికామాధవీ
 రేఖామంజులవాసనాలహరి పర్వెన్‌ప్రాతరానీతశో
 ఖాఖద్యోతవిలాసరాగలలితప్రంశుప్రభన్"

(భారతి అనార్కళి, విశ్వనాథ సత్యనారాయణ)



"పారావార ధరాధరోన్నతతరు వ్రాతాపగాఘోరకాం
 తారాకారములాసమస్తవనత్వప్రస్ఫుటన్మూర్తులా"

(భోగరాజు నారాయణమూర్తి, భారతి సం.4. సం.2)



"అక్షమాలికాదండకమండలు పుస్తకన్యస్తహస్తపం కేరుహుండును"

(మాతృమందిరము వేంకటపార్వతీశ్వరకవులు)



"సూనఫలభరిత తరుయుత కాననవల్లీమతల్లికా
 వాసకిరాతానీక నేతయై"

(కావ్యకుసుమావళి



"ఖలు డాత్మీయమహాట్టహాసనిబిడోగ్రద్వాన సమ్మూర్చితా
 బిలభూతప్రకరుండులోకభయదాక్షీణస్పులింగచ్చటా
 కులవీక్షాపరిభూతభీతక్రతుభుగ్వ్యాహుండు"

(కేసిరాజు వేంకటసుబ్బారాయకవి)



"నిఖిలరాజన్యమౌళికిరీటరత్న దినకరప్రభానీరాజిత
 నిజపాద పద్ముండును."

(తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"సుగుణప్రాభవచంద్రికాంచితయశః శోభాయమానాంగికిన్"

తేకుమళ్ల రాజగోపాలరావు కనకవల్లి)



"ధరహాసామృతవీచికాపునరుదాత్తస్వాంతరంగ
 ప్రియోత్తరమున్" (సి.యస్. జయరావు పుష్పమాల. 1-3)