పుట:Neti-Kalapu-Kavitvam.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యతిక్రమాధికరణం

121


"లలితగ్రాసకిసాలచర్వణ సముల్లాసక్రియాజాతగం
 ధిలడిండీరకణచ్యుతిన్"

"చంచద్గరుద్భిన్న నిర్మలవీచీమృదుడోలికా
 పరినటద్రా జీవపత్రంబుగన్"

(దువ్వూరి రామిరెడ్డి. వనకుమారి.)



"ఆశ్చర్యకృద్బహుళోద్గ్రంథనిబంధన ప్రచురితప్రాపంచికైశ్వర్య
 ధూర్వహులైనట్టి"
(పం. రామచంద్రరావు, జీవితాదర్శం -- భారతి)

"విశ్వమోహన సుధాంశునిసర్గమనోజ్ఞచంద్రికాస్పదమగు"
(ప్రణయరాధిక. శ్రీశేషాద్రిరమణకవులు." భారతి)

అని యీతీరున హేయమైన భాషావ్యతిక్రమం కనబడుతున్నది.అయితే యిట్లా అసంబద్ధవు సంస్కృతం కుక్కుతున్నారే గాని దాని వెంటనే సంస్కృతభాషానభిజ్ఞత సయితం కనబడుతున్నది. వ్యాకరణం యింకా స్ఫుటంగా యేర్పడని తెలుగువంటి జీవద్భాషలకు శిష్ఠలోకమే ప్రమాణమైనా. సంస్కృతం వంటి అప్రవాహిభాషల విషయంలో శిష్టలోకవ్యవహారాన్ని ప్రసాదించే పాణిన్యాదుల తంత్రాలను గాని వాటి సంగ్రహాలనుగాని దర్శించక వాటిస్వరూపం గోచరించదు. అట్లా గోచరించనిదశలో సంస్కృతం వ్రాయడం మొదలు పెట్టితే వుజ్జాయింపు చూపి వ్రాయవలసివస్తుంది. ఆవుజ్జాయింపులో శబ్దరూప వినాశం అర్ధవినాశం సంభవిస్తున్నవి. ఇట్లాటివ్రాతలకు హేతువైనదాన్నే భాషానభిజ్ఞత అని నేనంటున్నాను. దీన్నిగురించి పరిశిష్ట ద్వితీయాధ్యాయంలో మరికొంత వివరిస్తాను. మనదేశంలో నేటికాలపు కృతుల్లో భారతీయ సంస్కారం నశించి జీవంబోయి శరీరం మిగిలినట్లుగా ఈవుజ్జాయింపు అసంబద్ధ సంస్కృతంమాత్రం మిగిలింది. నేటికాలపుకృతుల్లో భాషానభిజ్ఞత తరుచుగా కనబడుతున్నదన్నాను.