పుట:Neti-Kalapu-Kavitvam.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

వాఙ్మయ పరిశిష్టభాష్యం -- నేటికాలపుకవిత్వం


అని శబ్ద తత్వజ్ఞులు చెప్పుతున్నారు.

పతంజలి "కుంభకారకులం గత్వా" (మహా) అన్నట్లు భాషనెవరూ చేయలేరని భారతీయులసిద్ధాంతం. ఒక వేళ చేస్తారని వొప్పుకున్నా దీన్ని ముందుకాలపువాండ్లు యెట్లా నేర్చుకుంటారు? సాధనాలు వేరే యేర్పరచారంటారా? వీటికి ప్రామాణ్యమేమిటి? వీటిని ముందు కాలపువారు అంగీకరిస్తారని నియమమేమిటి? పోనీ అట్టాటి వేమైనా వుంటే మాకెందుకు ప్రసాదించగూడదు? ముందుకాలపువాండ్లు యింకా తెలివిగలవాండ్లవుతారు గనుక, వారికి తెలుస్త వంటారా? అది అసంబద్దం. పాణిని పతంజలి ప్రభృతులు వ్రాసిన శాస్త్రాలను యెన్నో సంవత్సరాలు పరిశ్రమజేసి సంస్కారవంతుల మవుతున్నాము. వెనకటి కాలపువారికంటే ముందుకాలపువారు యెక్కువ బుద్ధిమంతులనడం అనుచితం. సొట్యశాస్త్రంలో

"భవిష్యతి యుగే ప్రాయో భవిష్యంత్యబుధా నరాః" (భ.నా)

భవిష్యత్కాలంలో నరులు అబుధులవుతారు అని భరతుడు అన్నాడు పోనీయండి. ముందు రాబొయ్యేవారికంటె యిప్పటివారు తెలివితక్కువవారనే వొప్పుకుందాము. ఈ తెలివి తక్కువ వారికే దాన్ని విప్పి చెప్పండి అంటున్నాను. చెప్పినా తెలియదంటారా? తెలిసేటట్టు చెప్పండి.

వక్తురేవ హి తజ్జాడ్యం శ్రోతా యత్ర న బుద్యతే.”}}
(వినేవాడికి తెలియకపోవడం వక్తయొక్క జాడ్యమేను).

అని పెద్దలుచెప్పుతున్నారు. అధికారులు లేరంటారా? ఒకరైనాలేరా? కొందరు భీరువులై అటుభార్యకు తగిలేటట్లు యిటుదేవతకు తగిలేటట్లు అయోమయంగా రచిస్తున్నారు. వ్రాయదలచుకుంటే నిర్బయంగా జగన్నాథాదులవలె భార్యనుగురించి వ్రాయండి. లేదా దేవతమీద భక్తిని శ్రీగుణరత్న కోశం, సౌందర్యలహరి మొదలయినవాట్లోవలె కనబరచండి. ఇదే ఉత్తమమార్గం. భీరుత్వం. అయోమయం ఆధమమంటున్నాను.