పుట:Narayana Rao Novel.djvu/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామచంద్రుని విద్యార్థిదశ

259

రామ: మీ దేశంలో అంతకంటే విచారకరమైనవి జరగడం లేదంటారా?

రౌనా: అనను. కాని చూడు, మా ఉద్దేశంలో ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశము. అటువంటి దేశము నేడిట్లు అథోగతిపాలైంది అంటే మా కెంత విచారంగా ఉంటుందో ఆలోచించు.

రామ: నిజమే, హీనస్థితిలో మానవుడికి అన్నీ దుర్బుద్ధులు పుట్టుతూ ఉంటాయి. కాని ఈ నాటికీ మా వివాహములు మంచివా, మీ వివాహములు మంచివా యన్న సంగతి నిర్ధారణ కాలేదు. జడ్జి లిండ్‌సేగారు వ్రాసిన వ్రాతల్ని చూశారు గాదా?

రౌనా: అతడూ మేయోవంటివాడే!

రామ: గాంధీమహాత్ముడు చెప్పినట్లు ఇద్దరూ పాయికానా పనిచేసినారు అనుకోండి. అది అవసరమే కాని లిండ్‌సే వ్రాతయంతయు యధార్థ కథనమైనను, అతడు తేల్చిన పర్యవసానంమాత్రం తప్పు అయిఉండవచ్చును. మేయో వ్రాసిన వ్రాతలు ఒకటి రెండు అంశాలు తప్ప తక్కినవన్నీ శుద్ధ అసత్యాలు. నీచమైన భావాలతో కూడివున్న ఆ చెడువ్రాత మా దేశానికి విరోధులు వ్రాయించారు ఆమెచేత.

లియొనారా యీ సంభాషణ యేమియు వినుటలేదు. ఆమె రామచంద్రుని చుట్టూ కల్పించుకున్న కథ కొంతవరకు కూలినది. ఎందుకు దానిట్లు మనస్సున కుంగిపోవుచున్నదో యామెకు తెలియదు. ఈ హైందవ యువకునకు, దనకు సంబంధమేమి? దేశము కాని దేశము విద్యకై వచ్చినాడు. తాను, తన కుటుంబము ఆ బాలుని చేరదీసినారు. సద్గుణములు కలవాడు, ఉత్తమ భారతీయ కుటుంబమునకు జెందినవాడు అని కదా?

అప్పుడా బాలికకు దా నీ బ్రాహ్మణ యువకుని ప్రేమించుచున్నానా యని లీలగా ననుమానము తగిలినది. లోన నణగియున్న రహస్య భావములన్నియు పైకిదేలి, యామె మనోనేత్రమునకు గోచరించినవి. ఈ యువకునకు వివాహము కాకయుండినచో, దా నాతని వివాహమాడి, యాతనితో భారతదేశమునకు బోయి, ఆ దేశమునకు ప్రేమనిధానపు కోడలై, యా దివ్యభూమిలో పెరుగుచు, ఆ మాత పరమపవిత్ర రహస్యాలలో భాగము పంచుకొనగోరినది. ఆ బాలికయు నా దేశమున సౌందర్యవతియే. పరిపూర్ణయౌవన, పరిమళార్ద్రమధురగాత్రి. ఏది యెట్లయినను రామచంద్రరావు తనవాడు. ఆ బాలకుని ప్రేమ యెట్లుండునో? భారతీయుల ప్రేమ యుద్వేగమయినదట. అతివిచిత్రమైనదని స్నేహితురాండ్రనుకొను మాటల యర్థము తెలియలేదు. తనచుట్టు జుమ్మని తేనెటీగల రీతి దిరుగు నమెరికను యువకులంద రొకవిధముగనే కనుపింతురు. రామచంద్రుడు తనయెడ సంచరించు విధమే వేరు.

వారందరు తనతో నాటపాటలనుగూర్చి ఎక్కువగను, శాస్త్రములను గూర్చి తక్కువగను ప్రసంగింతురు. వారు పరదోషాన్వేషణపరులు, కవిత్వ