పుట:Naajeevitayatrat021599mbp.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

శాసన సభా ప్రవేశ సమస్య:

గాంధీ వాదులు, స్వరాజ్య వాదులు

గాంధీగారికి జైలు ప్రాప్తించిన తరవాత, కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం *[1] లో కాంగ్రెసు పేరిట రాజ్యాంగ చట్టాన్ని చేపట్టి ఎందుకు పరిపాలన సాగించకూడదు అన్న ప్రశ్న వచ్చింది. ఆ విషయమై తర్జన భర్జనలు చేసి, నిర్ణయం తరవాత జరుగనున్న గయా కాంగ్రెసుకి వదిలివేశారు. గాంధీగారు నాయకత్వం వహిస్తున్నంతకాలం రాజ్యాంగ చట్టాన్ని చేపట్టడం అన్న ప్రసక్తే రాలేదు.

ఉద్యమనాయకుణ్ణి నిర్బంధించిన కొద్ది దినాలలోనే, సి.ఆర్.దాస్, మోతీలాల్‌నెహ్రూ గార్లను జైలునుంచి విడుదల చేశారు. వా రిరువురికీ గాంధీగారి పద్దతులపట్ల విముఖత ఏర్పడింది. లార్డ్ రీడింగ్ అందజేసిన రాజీ ప్రతిపాదనలకు గాంధీగారు ఒప్పుకోకపోవడమూ, చౌరీచౌరా ఉదంతం జరిగిన వెనువెంటనే గాంధీగారు ఉద్యమాన్ని విరమించడమూ అన్నవి ఈ విముఖతకు కారణాలు. సాధ్యమయినంత త్వరలో ఈ సహకార నిరాకరణ పద్దతికి స్వస్తి చెప్పాలని వారి తహతహ.

మన నాయకుడు అరెస్టయిన వెంటనే కార్యక్రమంలో మార్పు తేవడమన్నది నాకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. ఎల్లాగయినా దాస్ గారిని ఒప్పించి, రాజ్యాంగాన్ని చేపట్టడం అనే పద్దతికి వారిని విముఖులుగా చేసితీరాలనే దృఢసంకల్పంతో, వారిని కలుసుకోడానికని నేను కలకత్తా వెళ్ళాను. ఆయన దాపరికం లేకుండా తమ మనస్సులో ఉన్నదంతా నాతో చెప్పారు. "నీవు సహకార నిరాకరణ పద్దతికే అంటిపెట్టుకుని ఉంటాననడం శుద్ధ మూర్ఖత. ఆయనకేమో ఆరేళ్ళు శిక్ష విధించారు. ఈ ఆరు సంవత్సరాలలోనూ ఏమి జరుగనుందో ఆ భగవంతునికే తెలి

  1. * 1922 నవంబరులో