పుట:Naajeevitayatrat021599mbp.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిలటరీవారు అమలు పరుస్తూ ఉన్న ఉద్ధత విధానాలకు జడిసి, వారు మాకు నిలవనీడకూడా యివ్వడానికి నిరాకరించారు.

షోరనూరులో కాంగ్రెసువారికి ప్రత్యేక స్థావర మనేది ఏదీ లేదు. కాస్త సమీపంలో ఉన్న ఒట్టపాలియంలో మాత్రం కాంగ్రెసు వారు తమ కార్యాక్రమాలు సాగించడానికి వారి అధీనంలో ఒక యిల్లు ఉంది. మేము ఇరువురమూ ఎల్లాగో తంటాలుపడి పరిచయస్థుల సహాయంతో ఒట్టపాలియంజేరి, అక్కడవున్న "కాంగ్రెస్ హౌస్"లో విశ్రమించాము.

అగంతకునితో గడిపిన రాత్రి

అదే సమయంలో పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం సివారు మత్సపురి నివాసి, గుడిమెట్ల ఆచారి అనే యువకుడు ఏలాగో తంటాలు పడి ఒట్టపాలియంలోని యీ ప్రాంతానికి రాగలిగాడు. మిలిటరీ ప్రాంతంగా నిర్ణయింపబడకపోయినా ఒట్ట పాలియంలో కూడా కాంగ్రెసువారిని అనేక బాధలకు గురిజేశారు. పోలీసువారి చేతులలో బాగా దెబ్బలుతిని ఎల్లాగో తప్పించుకు వచ్చి అతడు ఆత్మరక్షణ కోసం ఈ "కాంగ్రెస్ హౌస్"లో దూరాడు, మేము ఉభయులమూ, అచ్చటి కాంగ్రెసువారూ కూడా ఆ యువకుడు సి.ఐ.డి.పెద్దలలో ఒకడయి ఉండవచ్చుననీ పోలీసువారు చితిగ్గొట్టారనే సాకుతో కాంగ్రెసు ఆఫీసులో దూరాడనీ అనుకున్నాము. నన్ను నమ్మించాలని అతడు ఎంతగా ప్రయత్నించినా, అతని పలుకులు విశ్వసించలేకపోయాను. కాని అదే రోజున మిలిటరీవారి చేతులలో మేము అనుభవించిన ఇక్కట్ల దృష్ట్యా అతణ్ణి వెళ్ళగొట్టలేకపోయాము.

ఆ రాత్రి అతను అక్కడే పడుకుంటానని కోరితే కాదనలేక పోయాము. అవలంభించ తగ్గ విధానానికి మేము ఆ రాత్రి ఒక పంథా వేసుకోవాలని అనుకున్నాము కాని అతడు సి.ఐ.డి. యేమోననే కారణంగా, మా సంప్రతింపులూ, తర్జన భర్జనలూ మరునాటి ఉదయానికి వాయిదా వేసుకున్నాము. మే ఒట్ట పాలియం చేరేసరికి, వెంకట్రామయ్యర్ని వెంటనే పట్నం రావలసినదని కోరుతూ, అతని భార్య