పుట:Molla Ramayanam.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రముఖంబులన్ నృపులఁజక్కుగఁజేయుదుఁగాననిప్పుడున్
శస్త్రముశాస్త్రముంగలవుసాహసవృత్తినిరమ్ముపోరగన్. |89|
వ.అనిన రామచంద్రుండిట్లనియె. |90|
మ.విను మావంటినృపాలురైనఁ గలనన్ వీరత్వముంజూపఁగా
ననయౌఁగాకమహానుభావుఁడవు నిన్నాలంబులో మీఱఁగా
నెనయున్ ధర్మువె మాకుఁ జూడమఱినీవేమన్ననీమాటకుం
గలనన్ మంచిదికాదు మా శెవుడుదోర్గర్వంబుమీ పట్టునన్.|91|
స.అనిన విని యెంతయు సంతోషించి భార్గరాముం డారఘు
రామునితో నిట్లనియె. |92|
ఆ.శివునిజివుకువిల్లు శీఘ్రంబె యానాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్ఱవీఁగ
నలదు నేఁడు నాకు వశ మైనయీచాప
మెక్కు పెట్టితియు మింతెచాలు. |93|
ఉ.రాముఁడు గీముఁ డంచును ధరాజనులెల్ల నుతింప దిట్టవై
భీమునిచాపమున్ విఱిచి వ్రేలెద వందుల కేమిగాని యీ
శ్రీమహి ళేశుకార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
తో మఱీ పోరు సల్పి పడఁ ద్రోతు రణస్థలి నీశరీరమున్.|94|
చ.అని తనచేతివిల్లు నృపులందఱుఁ జూడఁగ నందియీయ నా
ధనువును గూడితేజముఁ బ్రతాపము రామునిఁజెందెనంతనే
జనవరుఁ డాశరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడిబాణ మం
దుననిడియేదిలక్ష్యమనఁద్రోవలుసూపినఁద్రుంచెగ్రక్కునన్. |95|
చ.ఇట్లు మహాప్రతాపంబునఁ దాపలు ద్రుంచి యనర్గళప్రతాప
మ్మున భార్గవరాముదోద్గర్వంబు నిర్గర్వంబు గావించి జయ
మ్ముఁ గైకొన్నకుమారునిం గౌఁగిలించుకొని దశరధుండు