పుట:Molla Ramayanam.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్ములను వేయేసితురంగబులను బదివేలు దాసీజనమ్మును
లక్షధేనువులును వరణంబు లిచ్చి దశరధాదిరాజలోకమ్ము
నకు బహుమానమ్ముగా నవరత్నఖచితభూషణమ్ములును జీని
చీనాంబరమ్ములును నొసంగి సుగంధద్రవ్యమ్ముల నర్పించి
పూజించి యంపె నంత దశరధమహారాజు మరలి యయో
ధ్యాపట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యేమార్గంబున. |82|
ఆ.పరశురాముఁ డడ్డుపడి వచ్చి మీనామ
మెవ్వ రనిన మొలకనవ్వుతోడ
నేను దశరధుండ నితఁడు నా పుత్రుడు
రాముఁ డండ్రు పేరు భీమబలుఁడు. |83|
వ. ఆని వినిపించినఁ గ్రోధావేశవశంవందు డై యప్పు డప్పు
రశురాముండు రాముం గనుంగొని యిట్లనియె.
క.రాముఁడు నేనై యుండగ
నామీఁద నొకండు గలిగెనా మఱి యౌఁ గా
కేమాయె రణ మొనర్పఁగ
రామా రారమ్మటంచు రహిఁ బిలిచెఁ దగన్.
వ. పిలిచినతో డనే రామచంద్రుం డతని కిట్లనియె.
ఆ. బ్రాహ్మణుండ నందుఁ బరమపవిత్రుండ
వదియుఁగాక భార్గవాస్వయుండ
వైననిన్నుఁ దొడిరి యాహనస్థలమున
జగడ మాడనాకుఁ దగునె చెపుమ.
వ.అనిన విని పరశురాముం డిట్లనియె.
ఉ.శస్త్రముఁ దాల్చినం దగునె సన్నుతికెక్కినబ్రాహ్మణుండనన్
శాస్త్రము గాదు నాకెదిరి సంగరభూమిని నిల్చినంతనే