పుట:Molla Ramayanam.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలయుఁ గావున వసిష్ఠాదిద్విజవర్యులను గౌసల్యాదికాంతా
జనమ్మును నరుంధతి మొదలుగాఁగల భూసురభార్యలను మఱి
యు సకలబంధుజనంబును రావించి బంగరుటరదంబుల
నిడికొని దోడ్కొని రమ్మనియంపిన నతండును మహాప్రసాదం
బని తత్‌క్షణమ యంతఃపురంబునకుం బోయి కౌసల్య
కైకసుమిత్ర మొదలగు రాజకాంతలను వసిష్ఠాదిద్విజనరిష్ఠు
లను నరుంధతి మొదలుగాఁ గలము త్తైదువలను మిగిలినసకల
బంధుజనమ్మును రావించి యుక్తప్రకారమ్ముగాఁ గనకరధమ్ము
లపై నిడుకొని దశరధమహారాజుకడకుం గొనివచ్చిన యంత
దశరధుండు పుత్రధ్వయసహితమ్ముగరధమారోహించి సమస్త
సేనాసమన్వితుం డగుచు వాద్యఘోషంబులు దశదిశలు
నిండ నడచుచున్న సమయమ్మున్ నంతకు ముందు జనకభూ
వల్లభుండు దశరధమహీపాలు నెదుర్కొని తోడితెచ్చి
యడుగుల్ గడిగి యర్ఘ్యపాద్యాధివిధుల విద్యుక్తంబుగాఁ
బూజించి మానితంబుగఁ గానుక లొసంగి సకలసంప
త్సంపూర్ణ మయినవిశేషముం గల్పించి యసందుఁ బెండ్లి
వారిని విడియించె నంత నక్కడఁ గనకవికారమైనపీఠమ్ముపైఁ
గూర్చున్నసమయమ్మున దేవా ! శుభముహూర్తం బాసన్న
మగుచున్నది రమ్మని వశిష్ఠుండు సనుదేర నాతఁడు సని రామ
లక్ష్మణభరతశత్రుజ్ఞులకు మంగళస్నానమ్ముఁ జేయించి
నిర్మలాంభరణంబు లొసగి వేర్వేఱ నొక్క ముహూ
ర్తమ్మునఁ దనకూతు సీతను శ్రీ రామచంద్రునకున్ దన తమ్ముడు కుశధ్వజుని కూఁతు లగు మాండవ్యూర్మిళాశ్రుత
కీర్తులను భరతలక్ష్మణశత్రుజ్ఞులకును నిచ్చి వివాహముం
జేసి తనప్రియతనయల కొక్కకఱెకు నూఱేసి భద్రగజ