పుట:Molla Ramayanam.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరముల నందంద పొరలించి చూచినఁ
గదలక యున్నఁ జీకాకునొంది
బాషాణ మున్నట్టిపగిది మార్దబవ మేమి
కాన రాకుండిసఁ గళవళించి |74|
తే.రాజసూనులు కొందఱు తేజ ముడిగి
జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి
జనకుఁ డీమాయఁ గావించె జాలు ననుచుఁ
దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి .|75|
సీ. ఇది పర్వతాకార మీవిల్లు కను విచ్చి
తేఱి చూడఁగ రాదు దేవతలకు
నటుగాక మును శేషకటకునిధను పంట
హరుఁడె కావలెఁ గాక హరియుఁ గాక
తక్కినవారికిఁ దరమె యీకోదండ
మెత్తంగఁ దగుచేవ యెట్లు గలుగు
దీని డగ్గఱ నేల దీని కోడఁగ నేల
పరులచే నవ్వులు పడఁగ నేల |76|
తే.గురుతు సేసియుఁ దమలావుకొలదిఁ దామె
తెలియవలెఁ గాక యూరక తివురనేల
యొరుల సొమ్ములు తమ కేల దొరకు ననుచుఁ
దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు.
వ.అంత విశ్వామిత్ర మునీంద్రుడు రామచంద్ర ముఖావలో
కనంబుఁ జేసిన. |77|
చ.కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులను బట్టు కూర్మమ దసాతలభోగిఢులీకులీశులన్