పుట:Molla Ramayanam.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



గాయకులుమను భృత్యగణములు మిత్తురులు
 సతులు సుతులును జక్క నలరి
సరసులు జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులుఁ గడు నొక్క వంకఁ జేరి
తే. కొలువఁ గొలువున్న ఎడ వచ్చి కుశికపుత్త్రుఁ
డర్ధి దీవించి తావచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప మదిలోన నాత్రపడచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె |45|
శ. రాముడు దనుజులతో సం
గ్రమము సేయంగ గలదె కందుగదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో ముని రాజేంద్ర ! యరగు ముచిత ప్రౌఢిన |46|
మ. అనినం గౌశికు డాత్మ నవ్వి వినుమయ్యా రాజ ! నేచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపులగ ర్వాటోప బాహాబలుల్
ఘనుఁ డీ రాముఁడుదక్క వారిఁ గెలువంగా రాదు పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ గ్రతురక్షణార్ధంబు భూనాయక |47|

వ. అని ప్రి యోక్తులు పలుకుచున్న విశ్వా మిత్రునకు మిత్రకుల పవిత్రుండైన దశరధుండు మా ఱాడ నోడి యప్పుడు. |48|




క. మునినాధువెంట సుత్రా
ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రా
ముని సౌమిత్రిని వెస న
మ్మునితో నానందవార్ధి మునుఁగుచుఁ బనిచెన్. |49|
మత్తకోకిలము.
వారిఁ దోడ్కొని కౌశికుం డట వచ్చునయ్యెడ ఘోర కాయ
తారమధ్యమునందు నొక్కతె దైత్యకామిని భీకరా