పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

17

గీ|| పాలకుర్కి సోమపతితుc డీనడుమను
     బెనచె మధ్య (ప్రాస?) వళ్లు పెట్టి ద్విపద
     నప్రమాణ మిది యనాద్యంబు పద మన్న
     నరిగె రాజు-"

తర్వాత సోమనాథుఁ డోరుcగంటికి వచ్చి యద్భుతచర్యలచే స్వరచనమును సమర్ధించుకొన్నట్టు పద్యబసవపురాణమం దున్నది. ఈకారణముచేతనే యీశివకవుల కావ్యములనుండి ప్రాచీనలాక్షణికులు ప్రయోగముల నంతగాఁ గయికొనరయిరి. గ్రంథారంభమున దుష్టగణ ప్రయోగముచేసి యుద్ధములోఁ జచ్చెనని నన్నిచోడని నధర్వణుఁ డాక్షేపించెను.

  • [1]క|| మగణమ్ము గదియ రగణము

       వగవక కృతిమొదట నిలుపువానికి మరణం
       బగు నిక్కమండ్రు మడియఁడె
       యగు నని యిడి తొల్లి టెంకణాదిత్యుఁ డనిన్.

బమ్మెరపోతరాజుగారి గ్రంథములనుగూడ లాక్షణికులు కైకొనమి కిది కారణము గావచ్చును. ఆయన వీరభద్రవిజయరచనమును శివకవి సంప్రదాయము ననుసరించియేయున్నది. (వీరభద్రవిజయము భాగవతకర్త యగుపోతరాజుగారు రచించినది కావచ్చు నని నాతలపు).

ఒక శివకవి యిట్లు చెప్పుచున్నాడు.

ఇలఁ బాలకురికి సోమేశుండు మున్ను
తొలంగక ప్రాసయతుల్ ద్విపదలను
లలి రచించుట యది లక్ష్యంబుగాను
అలమి రేఫ రకారములు శివకావ్య
ములయందుఁ జెల్లుఁ దప్పులుగావు, గాన
ఆపాల్కురికిసోము ననుమతి నేను

  1. *ఈ పద్యమును శ్రీరామకృష్ణకవిగారు కుమారసంభవపీఠికలో నుదాహరించిరి.