పుట:Mahendrajalam.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్నానం చేస్తే వంటికి వీబూతి రేఖలు

గుంటూరుజిల్లాలో ఒక దేవీభక్తురాలిగా చెలామణి అవుతున్న అమ్మవారు స్నానంచేసి అలాగే తడిబట్టలతో వచ్చి, తన భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె శరీరంపై తడిఆరిపోగానే ఆమె వంటినిండా విభూతిరేఖలు ప్రత్యక్షమౌతవి. అక్కడ చేరిన భక్తులంతా ఆమె శక్తికి నిశ్చేష్టితులై కానుకలు సమర్పించి వెళుతుంటారు.

ఈ ప్రదర్శనలో గల అసలు రహస్యం ఏమిటంటే? స్నానానికి ముందుగానే తుత్తురుబెండసొన లేక అడవి ఆముదపుచెట్టు సొనతో శరీర భాగాలలో రేఖలు తీర్చిదిద్దాలి, ఆరిపోగానే అవి శరీరంపై కనుపించవు. స్నానం చేసిన తరువాత తడి ఆరిపోవటంతో పూర్వం దిద్దిన రేఖలన్నీ తెల్లగా మారిపోయి, చూచేవారికి విభూతి రేఖలవలె కనుపిస్తవి. ఆశ్చర్యంగా వుంటుంది.

నీళ్ళల్లో మంటలు

"పాస్పరస్"ను నీళ్ళలో కలిపి వుంచుకోవాలి. అవసరమయిన సమయంలో - ఆ నీటిని మండించవలననుకొన్నప్పుడే కొంచెం 'అప్లెయిన్‌'ను వేసినచో - పొగలు, మంటలు పుట్టి: చూచువారి కమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇసుకను కసాబిసా నమిలి ఊయుట

ప్రదర్శకుడు ఇసుకను (స్వచ్చమైన రాళ్ళు, రప్పలు, మట్టి, గవ్వలులేనిది) పంచదారవలె నమలుతానని ప్రేక్ష