పుట:MaharshulaCharitraluVol6.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

మహర్షుల చరిత్రలు


సుపుత్రుని గాంచెను. ఆతఁడు ఆకథుఁ డనుపేరఁ బెరిగి యుక్త వయస్కుఁ డయ్యెను.

ఆకథుఁడు వయసు గన్నంతనే సుశోభన యనుకన్యామణిని గాంతగా గ్రహించి తపోజీవనము గృహస్థజీవనము సమ్మిళిత మొనర్చి కపోతవృత్తిని జీవించుచుండెను. ఆ పుణ్యదంపతులకు యదృచ్ఛా లాభసంతుష్టి న్యాయపథ గమనము రెండే సంసారమున ముక్తిసాధనము లయ్యెను. అన్యాయ మార్గమున లభించినది మేరువంత బంగారమైనను వారు ముట్టరైరి.

ఒకప్పుడు న్యాయమార్గమున నా దంపతుల కన్నము దొరకదాయెను. అందుచే వారై దుదినము లుపవసించిరి. ఆఱవ నాఁడించుక యన్నము వారికి లభించెను. అదియే పదివే లసుకొని ఆకథుఁ డాయన్నమును దేవతార్చన మైనపిదప రెండు భాగములుచేసెను. సుశోభన పతి కాకు వైచి యందులో సగ మన్నమును వడ్డించి యారగింపు మను వేళకు "అమ్మా ! అతిథిని " అను కేక వారికి వినఁబడెను. ఆకథుఁడు వెంటనే లేచి ద్వారముకడ కరిగి అతిథి నతిగౌరవమునఁ దీసికొనివచ్చి తనకయి వడ్డించుకొన్న యాకునఁ గూర్చుండఁబెట్టి యాతనిచేత నాపోశన వడ్డించెను. ఆ యతిథి ఆ యన్న మారగించి యా దంవతుల నాశీర్వదించి వెడలెను.

ఇంతలో నింకొక యతిథి యంగవికలుఁడయ్యు ననుపమతేజస్వియై వచ్చి యాఁకలి గొన్న వాఁడ; నన్న మిడుఁ డని ప్రార్థించెను. ఆకథుఁడు వెంటనే లోని కరిగి తన కాంతను బిల్చి “కాంతా ! మిగిలిన సగ మన్నము రెండు భాగములు చేసి యొకభాగ మతిథి కిడి రెండవ భాగమును నీవు తిని ప్రాణములు నిలుపుకొను” మని పలికెను. అంత నాసాధ్వి “నాథా ! ప్రాణబంధువైన అతిథిని, ప్రాణాధికుఁడైన పతిని విడిచి నేను తిందునా? మీ యుభయులకు వడ్డించెదను, కుడువుండు. అది పతివ్రతనగు నా ధర్మము: