పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

మహాపురుషుల జీవితములు



ఉత్సాహముతో వాని ఉపన్యాసముల వినిరి. అతఁడా దేశమున పదునాలుగు ముఖ్యపట్టణములకుం బోయి యచ్చటి జనులకు వీనుల విందుగా మతము వేదాంతము నీతి హిందూదేశ పరిపాలనము మొదలగు నంశముల గూర్చి మహోపన్యాసముల నిచ్చి యందఱిచేతఁ గొనియాడఁ బడియె. అతని కీర్తి విని యాంగ్లేయ తత్వశాస్త్రజ్ఞుఁ డగు మిల్లుదొరయు సంస్కృతపండితశిఖామణియు వేదాంగ వేద్యుడు నగు మాక్సుమల్లరు దొరయు మఱియు ననేకులు వాని దర్శనము చేసి సంతుష్టాంతరంగులైరి. ఇంగ్లాండు దేశపు మంత్రులలో నగ్రగణ్యులగు 'గ్లాడుస్టను' గారిని 'డిసురైలి' గారిని జూచి కేశవచంద్రుఁడు వారితో మన దేశ వ్యవహారములను గూర్చి ప్రసంగించెను. ఆదేశమందంతట నతని యశము వ్యాపించుటచే నలువది పట్టణముల సమాజములవారు తమయూళ్ళువచ్చి యుపన్యాసము లిమ్మని వానిం బ్రార్థించిరి. కాని తీరిక లేమి యతఁడు వారి యభిలాషఁ దీర్ప జాలఁడయ్యె. మొత్తముమీద నతఁడక్కడ నున్న కాలములో రమారమి డెబ్బది సభలలో మాటలాడి నలువదివేల జనుల కుపన్యసించెను.

ఈగౌరవము లన్నిఁటికంటె వేయిరెట్లెక్కువ గౌరవమువానికి జరిగెను. ధర్మస్వరూపిణియుఁ గాంతాజనమతల్లియు భరతఖండ ప్రజలకుఁ దల్లియు నగు శ్రీ విక్టోరియా రాణీగారితనికి దర్శనమిచ్చి సంభాషించి వాని ప్రతిబింబమును వానిభార్య ప్రతిబింబమును (ఫొటోగ్రాపు) వారి వలనం గ్రహించి తన ప్రతిబింబమును తనభర్త యగు నాల్బర్టుప్రభువువారి ప్రతిబింబమును వానికిచ్చి గౌరవించెను. కేశవచంద్రసేనుని గౌరవించుటకు 'మిస్‌కార్పెంటరు' యను నామె బ్రిష్టలునగరమున హిందూదేశ క్షేమకరములైన ప్రసంగములు చేయుటకు 'నేషనల్ ఇండియన్ అస్సోసియేష' ననుపేర నొ