పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేశవచంద్రసేనుఁడు

47



సమాజము నేర్పరచెను. బ్రిష్టలు నగరమున కతఁడు పోయినప్పు డప్పటికి రమారమి నలువదేండ్ల క్రిందట స్వదేశమువిడిచి యింగ్లాండునకు బోయి దేశొపకారార్థమై ప్రాణములు విడిచి కీర్తి శేసుఁడైన రాజరామమోహనరాయల సమాధిని జూడఁబోయి మృత జీవుఁడైన యామహాత్ముని యందలి గౌరవముచే మోకాళ్ళపయిం బడి నమస్కరించి యాబ్రహ్మసమాజ స్థాపనాచార్యుని యాత్మకు మోక్ష మొసంగుమని భగవంతుని బ్రార్థించెను. బాల్యమునుండియు నితనికి కవికులసార్వభౌముఁడగు షేక్స్పియరుమీద నత్యంతాభిమాన ముండుటచే నాతనిజన్మస్థానముఁజూడ నభిలాషకలుగ 'నావను'నది మీదనున్న స్ట్రాటుఫరుడు గ్రామమునకుఁ బోయి యాతఁడు కాపుర ముండిన కుటీరమును వానిపుట్టిన చిన్న గదియు నతఁడు నాటకములు వ్రాసికొన్న బల్లయుఁ జూచి సంతసించి పిమ్మట నాతని సమాధి యొద్దకుఁబోయి ముప్పదియెనిమిది నాటకములు రచియించి నాగరికులగు సకల జగజ్జనులచేఁ కొనియాడఁబడు నాకవిరాజు నుద్దేశించి వినయమున నమస్కరించి తనకుఁ గల గౌరవమును వెల్లడించెను.

అనంతర మతఁ డింగ్లండు దేశమునుండి 1870 వ సంవత్సరము సెప్టెంబరు 17 వ తేదీని బయలుదేరి అక్టోబరు 15 వ తేదీని బొంబాయి నగరముఁ జేరెను. చేరినతోడనే యచ్చటి జనులతని కపూర్వమయిన గౌరవముఁ జేసిరి. అచ్చటినుండి యతఁడు కలకత్తానగరమునకుఁ బోవ స్వదేశస్థులందఱు బొంబాయి నగరమునందు జరిగిన యుత్సవముకంటె గొప్ప యుత్సవముఁ జేసి వానిని సన్మానించిరి. ఇంగ్లాండునుండి వచ్చిన స్వల్ప కాలములోనే కేశవచంద్రుఁడు మన దేశస్థుల సంఘవృద్ధికి నీతివృద్ధికిన్నీ హిందూసంస్కరణ సమాజము నొకదానిని నేర్పరచెను. ఆసంస్కార మీక్రింది యైదువిధములుగఁ జేయుటకుఁ బ్రారంభించెను. జ్ఞానము బీదలకు సయితము గలుగు