పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

మహాపురుషుల జీవితములు



క్రొత్తపద్ధతిగా శిస్తునేర్పఱచి కలెక్టరు యొక్కయు దొరతనమువారి యొక్కయు నంగీకారమునంది గ్రామము బాగుచేసెను.

1861 వ సంవత్సరమున సేలము జిల్లాకు సేలము పట్టణమే ముఖ్యపట్టణముగా నేర్పడెను. అదివఱకు మైసూరులోనున్న పెద్ద కలెక్టరు కచ్చేరీ సేలమువచ్చెను. అ జిల్లాలోని నాముకాలు పట్టణమందు సబుకలెక్ట రొకరుండు నట్లేర్పాటు చేయఁబడెను. గవ్వర్నమంటువారు రామయ్యంగారిని మొదటితరగతి డిప్యూటీ కలెక్టరుద్యోగమున ఖాయపఱచి నాముకాలో సబుకలెక్టరుగా నుండవలసినదని పంపిరి. అక్కడ సబుకలెక్టరుగా నాయన 1864 వ సంవత్సరమువఱకు నుండిరి.

ఈసమయమున నిండియాగవర్నమెంటువారు కాగితములనాణెములను క్రొత్తగానిర్మింపఁదలంచిరి. కాగితముల నాణెములనఁగాబ్యాంకునోట్లు. ఇవియు రూపాయలు కాసులువలెనే యిప్పటికి దేశమున నాణెములుగజెల్లుచున్నవి. రామయ్యంగారు నమ్మదగిన మనుష్యుఁడగుటచే నిండియాగవర్నమెంటువారాయన నీడిపార్టుమెంటులోఁబెట్టదలచి తిరుచునాపల్లిలో నెల కాఱువందలు మొదట జీతముఁ గలిగిక్రమాభి వృద్ధిగా నెనిమిదివందలవఱకు జీతముగల నశిస్టాంటు కమీషనరుగా నియమించిరి. ఈ యుద్యోగములో నతఁడు 1865 వ సంవత్సర ప్రారంభమందుఁ బ్రవేశించెను. ఒక సంవత్సరములోఁ బనిచేయునప్పటికి తనకుఁ దగినంత పనిలేదని తెలిసికొని జీతముపుచ్చుకొనుచు సుఖముగాఁ గూర్చుండుట కిష్టములేక యాసంగతి నతఁడు గవర్నమెంటువారికిఁ తెలియఁజేసెను. గవర్నమెంటువారు వెంటనేయాయనను ప్రధానపు సెక్రటరిగా యాఫీసుకుమార్చి యతఁ డదివరకు