పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[34]

సి. వి. రంగనాథశాస్త్రి

265



నాథుఁడు చదువుకోవలసినంత కాలము జ్ఞానాభివృద్ధికై జదువుకొనవలసినదని నాయభిప్రాయము. నీదగ్గరనుండుటచేత వానియదృష్టము బాగున్నదని నేదలంచెదను. ఆసంగతియెఱింగి అతఁడు గూడ నీబోధనవలనఁ గలుగు లాభము పొందుగాక ! అతఁడు నిఘంటువులు గొప్ప పుస్తకములు జదువుకొనగల సమర్థుడైన పక్షమున నెట్టి యాటంకము లేక వానికిఁ గావలసిన పుస్తకము లన్నియు నీయవలయును కాని యాపుస్తకము లతనికిఁ బూర్తిగ నిచ్చినట్లు చెప్పవద్దు. వలయు పుస్తకము లన్నియు మొదట నెరువిచ్చినట్లిచ్చి చదువుమాని వెళ్లునపుడు వానికి సొంతముగ నీయవలయును."

1839 వ సంవత్సరమున చిత్తూరులో నున్న యాజడ్జికి జెన్నపట్టణమందు సుప్రీముకోర్టులో జడ్జిపని యయ్యెను. కెర్ దొరగారు కలకత్తాకు వెళ్ళిరి. జడ్జీగారు రంగనాథుని వెనుకటి పాఠశాలలో నుంచుట కిష్టపడక దొరతనమువారి హైస్కూలుకు పంపఁదలఁచి ప్రధానోపాధ్యాయుఁడగు పవెల్‌దొరగారి కుత్తరమిచ్చి బాలకు నంపెను. రంగనాథునిజేర్చుకొన్న స్వల్పకాలములోనే వానిబుద్ధి యెట్టిదో పవెల్‌దొరకు తెలిసెను. ఆబాలునకు గణితశాస్త్రములోనున్న ప్రజ్ఞనుబట్టి పవెల్‌దొరగారు వానిచేతఁ గ్రింది తరగతుల కాశాస్త్రములోబాఠములు చెప్పించుచువచ్చిరి. రాజాసర్. టి. మాధవరావుగారప్పుడు చిన్న తరగతిలో నుండి రంగనాథశాస్త్రివద్ద చదువుకొనిరి. 1842 వ సంవత్సరమున రంగనాథశాస్త్రి హైస్కూలు పరీక్షకుఁ బోయి శ్లాఘనీయముగఁ గృతార్థు డయ్యెను. ఆపరీక్షకుఁ బోయిన వారిలో నతఁడె మొదటి వాఁడు. కృతార్థులైన వారిలోను మొదటివాఁడె. అతనిపేరిప్పటికిని జెన్నపురి ప్రెసిడెంసి కాలేజీలో గృతార్థులైన బాలకుల పట్టీలో మొదటనున్నది. పరీక్షయందు గృతార్థుడైన పిదప నతడు తనకు మహోపకారియైన జడ్జీని జూడబోయెను. ఆదొర