3. | కథానాయకుడు గట్టుప్రక్క త్రవ్వి బాగుచేస్తూ ఉంటాడు | |
4. | రైతులు పొలం ఈ చివర నుంచి ఆ చివరకు కథానాయకుడూ నాయిక ఉన్నచోటికి నాగళ్ళు తోలుతూ వస్తూ వేడుతూ ఉంటారు | |
సంభాషణ:
కథానాయకుడు: (త్రవ్వుతూ) ఈ యేడు పంటలు బాగా పండితే మన అప్పు తీరిపోతుంది.
నాయిక: పొలంపనేనా, ఇంకా మనం ఈ గ్రామానికి ఇతర సహాయాలు ఏమన్నా చేయవద్దా?
నాయకుడు: రైతుసంఘం స్థాపించామా, రాత్రి పాఠశాల నడుపు తున్నామా, నా రాణీ.....
నాయిక: వేళాకోళానికన్నా నన్ను రాణి అనకండి!
నాయకుడు: ఏమి అనమన్నావూ?
నాయిక: స్నేహితురాలా అనండి..
నాయకుడు: వట్టి చప్పగా ఉంది ఆ మాట. ఆత్మేశ్వరీ ఆంటాను.
నాయిక: అది బాగుండదు. నేను ఈశ్వరినా, శాంభవీ శాకినీ ఢాకినీనా!
నాయకుడు: ఏమన్నావు నరసూ?
నాయిక: నరసూ ఏమిటి? నరుసులాగ, నేను నరసు కాఫీనా?
నాయకుడు: ఓ రైతుపిల్లా! ఏంటంటవు?
నాయిక: నన్ను రైతుపిల్లా అనకండి!
నాయకుడు: ఏమిటీ నేతి నీతి?
నాయిక: నేను నెయ్యీకావా లనలేదు. నూనే కావాలనలేదు.
నాయకుడు: ఆముదం కావాలనలేదు పుట్టబోయే చిన్నబిడ్డకు?
నాయిక: నాకు సిగ్గు కలిగించే మాట అనకండి!
నాయకుడు: | సిగ్గుమాలిన బాల | |
నాయిక: | పారపట్టిన రైతు | |
నాయకుడు: | నన్ను రాజనబోకు | |
నాయిక: | నన్ను రాణనవోకు | |
నాయకుడు: | బంగారు నేలలో | |
నాయిక: | పసిడి పండేవేళ | |
రైతులు: | బంగారు నేలలో | |