తృతీయ భాగము 209
ప్రసిద్ధి. విరాగియైన వనవాసికి రాజకన్యలయు బోగముసానులయు రహస్యవృత్తము లెట్లు తెలిసె ? కష్టపడి యార్జించిన దూరదృష్టి దూర శ్రవణాదులకు ఫలముగా నీ సుఖముల ననుభవింపకపోయి నను, విమర్శనముతో సావకాశము గC బరీక్షించి తెలిసి కొను నానంద మైన ననుభవించినాఁడు పో ! పచ్చిపచ్చి మూటలతో పెద్దమనుష్యుల యెదుట సిగ్గులేక విపుల వ్యాఖ్యానములకుం దొడంగ నాతని పరమ పవిత్రమైన నోరెట్లాడెను ? పరమపావనులగు మునులు ఏ జుగుప్సయు లే డ్ర గ్రుక్కిళ్ళు మ్రింగుచు నెట్లు వినిరి ! ఇట్టి రుచికరములగు కథలు చెప్పవాఁడు కావుననేగదా బయిషీశ్వరు ಲಲ್ಲು జపతపముల వదలి యతనిచుట్టు బెల్లమును ముట్టడించెడు చీమల వలె మూగియుండుట ! సూతమహాముని కీ కళాపూర్ణోద యము నారోపింపకుండుట సూరనార్యుని ఘన తకుఁ దా వల ము. అయిన నింకొక విధమైన యనుచితముఁ జేసియున్నాఁడు. ఇంత దనుక చవులూరెడు కామక్రీడలు వర్ణించి రతివర్ణనకు నాహుతిగా నీయCబడిన పద్యములు సుమారు 25 తటుక్కున వైష్ణవ రాద్ధాంత ముతో భక్తిరసముఁ గొంతదింపి గ్రంథసమాప్తి యొనర్తమని, లక్ష్మీ నా రాయణ సంవాదమ నెడు గతి మెూ క్షమును లేని ఘట్ట మొకటి తెచ్చి వేసి కొనినాఁడు. కృతిపతికిఁ గామ మోక్షములు రెండును గాంకి త్రము లేమో !. ఈ లోకమునకొకటి. ఆ లోకమునకొకటి ! కానc ద ప్పేమియు లేదుగాని, కావ్యముల నీ రీతి నిహపరముల పరముగా బిగువుతో నీడ్చిన వానియైక్యము తునుగును. అట్లగుట నియ్యవి సౌభాగ్యవిరుద్ధములు. కలయిక లేని రసము లC గలుపఁ జూచిన నరుచి. పా లలో చక్కెర వేసిన నిర్దోషము. ఉప్ప వేసినచో !
హిందూ దేశీయులు మనసు మెత్తనివారు. కాయములంత కంటె మెత్తన ! సత్త్వగుణమను సాకు పెట్టుకొని యెన్ని దెబ్బలు పడినను "నావిగావివి పరమాత్మకుం జేరినయవి" యని యపహాస్య మునకుం బాత్రములగు వింత కారణముల గొణిగికొనుచు, వంచిన తలయెత్తక, వణఁ కెడు నొడలునాపక, పాబ్రెడు కాలునిలుపక, పోవుచుందురు ! రాజసగుణమగు తేజము ప్రధానమని మనకు C దెల్పుటకోయన, సూరన్నయా దౌర్భాగ్యపునయ విరచనలో రచించిన యూ మూడు పద్యముల ప్రతాపముఁ గనుండు .
క. సకలకళా నిపుణులు సే
వకులై కొలువఁగఁ బ్రతాపవంతుఁడు గొలిపి