పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుని రాయబారము

277

కులము కొఱంత యట్టులొనగూరెను బల్కులు, రాజరాజు ని
చ్చలు నినుబెద్దఁజేయఁగొనసాఁగెనుడంబు, పవిత్రవంశ పూ
జ్యుల మముబోఁటి యోధుల విశుద్ధయశంబును మాపునీదు పె
గ్గెల నటు గట్టిపెట్టి రణ కేళికి రమ్మిట సూతనందనా.

అరయండెక్కములో, రథాంగములొపల్యాణంబులో కోలలో
తురగ శ్రేష్ఠములో కరీంద్రఘటలో తోత్రంబులో గాక భూ
వరులున్ బ్రాహ్మణయోధులున్న సభలోభాషింతువే ధీరునాన్
బరరాజన్య గళాబ్జనాళ దళన ప్రావీణ్య ధుర్యుండునాన్ .

అని సజ్యంబునుజేసి కార్ముకము నత్యాకుంచిత భ్రూకుటిన్'
మునుకో, భీష్ముఁడునాఁగుమాఁగుమని తాముం జేయి సారించియా
తనిఁ బీఠంబునం బెట్టఁ జిత్తమునఁ గ్రోధజ్వాల ధూమంబుపై
కొనెనో నాగురుపుత్రుఁడూర్చెను సభాకూటంబు వేండ్రంబుగాన్

జననీ కంఠలతానికృంతన గళత్సారాస్ర ధారాముఖం
బునఁ గెంజాయలుచల్లుగొడ్డలి తృషన్ భూపాస్రసంతర్పణం
బునఁ జల్లార్పడెక్షత్రియాన్వయమురూపున్ మాపియా రేణు కా
తనయుం; డాతఁడు బ్రాహణుండొ పరుఁడోతథ్యంబు యోచింపుమా
 
కురుసభనుండు నర్హత యకుంఠిత గౌరవమేఁగె; నింక ని
త్తెఱఁగున నిల్వనేల, పనిదీఱెనురండు మహీసురుల్, వృధా
భరమెక కౌరవేంద్రునకు; భండనమెల్లియకాకమాన, దం :
దొరసెడి గర్ణపార్థవిశిఖోద్ధురతం గనుగొందుమేగదా!