పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

కవికోకిల గ్రంథావళి

సూతసుతుండ నయ్యెదనొ సూర్యతనూజుఁడనౌదునో రిపు
ద్యోతిత కంఠనాళ రుధిరోదధిలో జయలక్ష్మిపోత ము
ఱ్ఱూతలువోవ నెట్టుకొని యుద్ధతినేఁగెడువాఁడు సూతసం
జాతుఁడొ క్షత్రియాన్వయ నిశాపరిపూర్ణ సుధామయూఖుఁడో

తేరకుఁగౌరవేశ్వరునిఁ దిట్టుచుఁదిమ్ముచు వాలుబొజ్జలన్
ధేరులలీలఁ బెంచికొని పెద్దఱికంబు భరింపుడన్న నిం
కేరును నోరులెత్తనటు లెంతయు మాటకు వేయిమాటలన్
దూఱుట కబ్బెసంబయిన దూబలతో సరిపల్కవచ్చునే?

అవనిసురుల కొఱకు నమవస నిలుచునా
పుంజులేక ప్రొద్దువొడవకున్నె !
చూతమింక రణము చొప్పుడునప్పుడు
నర్జునుండు శరము లడరునపుడు.

బలవంతులైన వైరుల
మెలకువఁ దప్పించుకొనుట మేలగు; మధురో
జ్జ్వలవాక్పూర్ణుఁడు, కార్యం
బులవిజ్ఞుఁడు సంజయుండు, పోలఁగ నతనిన్.

కుంతీపుత్రులపాలికంపి యట నెగ్గుల్ పుట్టకుండం గడున్
శాంతోక్తుల్ నుడివించి సంధివిధముల్ చర్చింపఁజేయించి దు
ర్దాంతాభ్యాగమలీల మాన్పి ధరణీరాజ్యంబు నేలుండు మా
స్వాంతంబుల్ ముదమొందఁబాండవుకురుక్ష్మా పాలకుల్ నెమ్మిమై