పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుని రాయబారము

275

లక్కయింటనుమే నలసి నిద్ర వోయెడు
          కుంతిపుత్రుల గాల్పఁగోరినటులు;
విషసంయుతాన్నంబుపెట్టి భీమన్నను
          జంపుయత్నంబులు సలిపినట్లు,

అంతతేలికయే రణమందునిల్చి
పార్థబాణా సనోన్ముక్త పరకఠోర
కంఠలుంఠన లీలాప్రకార ఘోర
శరపరంపర కోర్వంగఁ గురుకులేశ.

బెట్టిదముగ గంధర్వులు
ముట్టగనిన్నపుడు పార్థుభుజవీర్యం బి
ట్టిట్టిదనుచు నీమదికిం
దట్టదె రవయేని? యింతదాపఱికంబే?

అనవుడు కోపంబురూపంబుదాల్చిన తెఱంగుస నుగ్రుండై పలుకంబోవు, దుర్యోధనుని వారించి సటాలుంచసంబున గర్జించుపంచానన కిశోరంబువరవడి కర్ణుఁడిట్లనియె.

యుద్ధము గల్గినప్పుడు బలోన్నతి చూపక ధర్మశాస్త్రసం
బద్దమనస్కులై పనికిమాలిన సుద్దులు పల్కుచుందు; రీ
బుద్ధులవేలోకో పరచమూ కరకంఠ మృణాలహంస చం
చూద్దతి మీఱు క్రూరవిశిఖోత్కరముం బఱపింపలేనిచో.