పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కవికోకిల గ్రంథావళి

సమరమందు వైరి సమ్ముఖంబుననిల్చి
యుద్ధురాస్త్రచయము లోర్చుకన్న
నోలగంబుననె రణోక్తులు వచియింపఁ
గొంతమెప్పుగాదె కురుకులేశ.

నిర్జరనాధుపుత్రునొకనిన్ మనమందఱ మాలముట్టున్నాఁ
డూర్జితబాహుగర్వమున నొప్పుదొఱంగఁగఁ జేసినారమే!
తర్జన భర్జనాదుల నుదాత్తత సూపెదుగాని పోరునం
దర్జును నొంచినాఁడవె శరాసన పాండితి మేరమీఱఁగన్.

పందతనాన నుత్తరుఁడు పాఱఁగ సారథిగాఁగ దేరిపై
ముందల బెట్టి పార్థుఁడు సముజ్జ్వలసారశర ప్రకాండముల్
గ్రందుకొనంగనేయఁగ వికత్తనముల్ దెగనాడు నేఁటివా
రందఱులేరొ, సంగర విహార మనోరథముల్ సెలంగవో!

నాఁడు నరుండుకైవడిని నాటిన తూఁపుల పోటుగంటులీ
నాఁడును గ్రొత్తనెత్తురులనానెడి; మానఁగలేద; యింతకే
పోడిమిమాలి యాలమునఁబోటరులంచుఁ దలంపనేల మీ
రాడిన పోటుమాటలు రణావనిఁబల్కినఁగాదె దీటగున్.

అబలయౌ ద్రౌపది యార్తయై కుయ్యిడ
          నోలగంబునఁ జీర లొలిచినట్లు;
కపటపు ద్యూతంబుఁ గల్పించి పాండుపు
         త్రులపాలి రాజ్యంబు గెలిచినట్లు;