పుట:Kavijeevithamulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

కవి జీవితములు



లెంతయు నేర్చినవాఁ డని సోమయాజి జైనపండితులతోఁ జేసినసంవాదాదికములవలనం గోచరం బగును. అట్టివానివివరములు గ్రంథస్థములు గాకున్నను, అట్టి సంవాదములవిషయముమాత్రము సోమదేవ రాజీయము మొదలగుగ్రంథములలోఁ గొంత వివరింపఁబడి యున్న దాని నే నీవఱకే ప్రకటించితిని. ఆవృత్తాంతమును వివరించుటకు ముందుగ నద్వైతమతబోధ మాంధ్రభాషలోఁ జేసినయాచార్యులలో సోమయాజియే మొదటివాఁ డని చెప్పవలసి యున్నది. ఆంధ్రులలోఁ దత్త్వరహస్యము లరయఁగోరెడునాంధ్రభాషాపండితు లందఱును సోమయాజిమార్గముం దెలిసికొనకయే యితరగ్రంథము లభ్యసింపరు. ఇఁక వేదాంతగ్రంథములు తెనిఁగింప నుద్యోగించువా రందఱును సోమయాజిమార్గమునే యవలంబించి నవీనగ్రంథములు రచియించిరి.

ఇట్టివారిలోఁ బౌరాణికకవు లందఱును దా మాంధ్రీకరించుగ్రంథములలోఁ బ్రసక్తమైనచోటుల నెల్ల మతోపన్యాసములఁ బద్యరూపముగాఁ జేయుచునే వచ్చుచుండిరి. అందులో భారతమును, భాగవతమును, జ్ఞానవాసిష్టమును, విజ్ఞానప్రదీపికయును, సీతారామాంజనేయసంవాదము మొదలగుగ్రంథములను రచియించినగ్రంథకర్తలు సోమయాజితోపాటు కేవలమును గురురూపులుగా నాంధ్రులవలన గ్రహింపఁబడినవారై యున్నారు. ఇట్టివారిలోఁ భారత మన్ని గ్రంథములలో నెట్లు ప్రామాణికగ్రంథ మయ్యెనో అటులనే అద్వైతశాస్త్రబోధకు లగుకవులలోఁ దిక్కనసోమయాజియు గౌరవనీయుఁడును, అగ్రగణ్యుఁడును నై యున్నాఁడు. ఇట్టివిశేషములను జూపుటకును కేవలము ఆంధ్రభాషలోపలనే అద్వైతమతబోధము కోరువారికి నుపయుక్తముగ నుండుటకొఱకు పైగ్రంథములన్నిటిలో నుండుతత్వవిషయికము లగుభాగముల నెత్తి వేఱే యొకగ్రంథము పర్యాయమున నచ్చు వేయుచున్నాఁడను.

తిక్కనసోమయాజి కాకతీయ గణపతి మాహారాజుం జూడఁబోవుట.

సోమదేవరాజీయ మనుప్రతాపరుద్రవంశచారిత్రములోఁ బ్రతాపరుద్రునిమాతామహుఁ డగుగణపతిదేవరాయని దర్శించుటకుఁ దిక్కన