పుట:Kavijeevithamulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

61



ము రమ్మనిన నేమనువాఁడో. భటులవలన నాతనివృత్తాంత మంతయు వినియేయుంటిమి. అట్టివవ్నె వాఁ డెట్లు స్వాధీనుండగును? కాకున్నఁ జేయునది యేమి?" అని యనేకవిధంబులఁ జింతింపుచు నిద్రించెను.

రాజునకు స్వప్న మగుట.

ఇట్లు నిద్రించియున్న యారాజశిఖామణికి స్వప్నంబున నాతని యిష్టదైవంబు సాక్షాత్కరించి ఓయీ ! భారతంబుఁ దెనిఁగింపఁ దిక్కనయే సమర్థుండు. ఒరులొక్కరును నట్టి మహత్తర కార్యంబునకుఁ జాలరు. ఆతనిఁ దోడ్తెచ్చి యా కార్యంబు నెఱవేఱుప నియమించుము. అతఁడును మద్భక్తియుతుండు. నీవురమ్మనిన వచ్చి నీయభీష్టంబు నెఱవేఱ్చువాఁడు గాని వేఱుచేయువాఁడు గాడు, అని తా నంతర్ధానము నొంది నాపుడమి ఱేఁడు నిద్ర మేల్కాంచి ప్రభాతం బగుడుఁ గాలోచితకృత్యంబులు నిర్వ ర్తించి మిగుల సంతసంబున సభాంతరంబున కే తెంచి యచ్చోట నున్న విబుధులకు దనస్వప్నంబు వినిపించెను. వారందఱును నుల్లములు నుల్లసిల్లి తత్స్వప్న ఫలంబు విప్పి చెప్పి యిట్లనిరి. ఈ కార్యంబునకు మీ యిష్టదైవంబు మీకంటెను వేగిరించుచుండ మీరు సంశయింపనేల? ఈశ్వరానుగ్రహంబునఁ గార్యంబు నెఱవేఱును. భగవదాజ్ఞానుసారంబుగఁ గార్యంబు నడుపుఁడు, అనుడు సంతసంబున నట్ల కాక యని యాభూపతి తగుమంత్రులఁ బిలిచి వారి నాకవివరుఁ దోడ్తీ నియమించి వారితో నొకపసిఁడియడ్డలయందలంబు నాకవివరునకుఁ బనిచెను.

తిక్కనకు స్వప్నమున హరిహరనాథుఁడు దర్శన మిచ్చుట.

ఇచ్చటఁ గాశికానగరంబున నాఁటిరేయిఁ దిక్కనయిష్టదైవంబగు హరిహరనాథుండు తిక్కనతండ్రి యగుకొమ్మనామాత్యు నాకలో కనివాసు ముందిడుకొని వచ్చి యాతనికి స్వప్నంబున దర్శనం బొసంగెను. అనంతరము కొమ్మన తిక్కనం జూచి యోవత్సా ! నీదేవుం డగు హరిహరనాథుండు వచ్చి యిదె నినుఁ గృతార్థుం జేయ నున్న వాఁడు, చూడుము, అనుడు నాతఁడు గన్నులు విచ్చి ముందున్న యద్వయబ్ర